జడ్జీ భార్యాతనయులపై బాడీ గార్డ్ కాల్పులు (వీడియో)

Published : Oct 13, 2018, 06:16 PM IST
జడ్జీ భార్యాతనయులపై బాడీ గార్డ్ కాల్పులు (వీడియో)

సారాంశం

కాల్పులు జరిపిన తర్వాత మహిపాల్ సదర్ పోలీసు స్టేషన్ కు చేరుకుని అక్కడ కూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పారిపోయాడు. 

గుర్గావ్: ఓ న్యాయమూర్తి భార్యపై, కుమారుడిపై ఆయన బాడీ గార్డే కాల్పులు జరిపాడు. గురుగ్రామ్ లోని బిజీ మార్కెట్లో అతను శనివారం అందుకు తెగించాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. 

న్యాయమూర్తి కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గురుగ్రామ్ లోని సెక్టార్ 49 ఆర్కాడియా మార్కెట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మహిపాల్ అనే గన్ మ్యాన్ ను న్యాయమూర్తి వద్ద ఏడాదిన్నర క్రితం పోస్టు చేశారు. 

కాల్పులు జరిపిన తర్వాత మహిపాల్ సదర్ పోలీసు స్టేషన్ కు చేరుకుని అక్కడ కూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పారిపోయాడు. స్టేషన్ హౌస్ మాస్టర్ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ తర్వాత అతన్ని పట్టుకున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !