వార్నీ.. భర్తను రూ.5 లక్షలకు అమ్మేసింది, ఒప్పందపత్రం కూడా రాసుకుంది.. ఎక్కడంటే...

Published : Oct 21, 2023, 07:20 AM IST
వార్నీ.. భర్తను రూ.5 లక్షలకు అమ్మేసింది, ఒప్పందపత్రం కూడా రాసుకుంది.. ఎక్కడంటే...

సారాంశం

భర్తను వేరే మహిళకు 5 లక్షలకు అమ్మేసిందో భార్య. దీనికోసం రాజీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 

కర్ణాటక : కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన  అందరినీ షాకింగ్ కు గురి చేసింది. ఓ మహిళ కేవలం రూ. ఐదు లక్షలకు తన భర్తను  ఇంకో మహిళకు అమ్మేసింది. ఇది చదువుతుంటే.. శుభలగ్నం సినిమా గుర్తొస్తుంది కదా..ఆ సినిమాలో హీరోయిన్ తన భర్తను కోటి రూపాయల కోసం మరో మహిళకు అమ్మేస్తుంది. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అంటూ ఆ సినిమా వచ్చిన సమయంలో చర్చ కూడా నడిచింది. అయితే.. నిజజీవితంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయని నిరూపించింది ఓ గృహిణి..

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..  కర్ణాటకలోని మాండ్య దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో.. ఓ మహిళ భర్త.. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయం ఆ భార్యకు తెలిసింది. దీంతో నిఘాపెట్టిన ఆ మహిళ వారిద్దరిని బెడ్ రూమ్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నిలదీసింది. తప్పు చేసిన భర్తను వదిలేసి.. ఆ ఇద్దరు మహిళలు గొడవ పెట్టుకున్నారు. దీంతో ఈ గొడవ పంచాయితీకి  చేరింది. ఆ మహిళ పంచాయతీలో మాట్లాడుతూ..‘నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు..  నా డబ్బులు నాకు ఇచ్చేసి ఆయనను తీసుకెళ్ళు’  అని చెప్పింది.

ఇంకా వెనక్కి రాని రూ. 10,000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు: ఆర్బీఐ

దీనికి మండిపడ్డ ఆ భార్య.. ‘ఇలాంటి భర్త నాకు అవసరమే లేదు.  నువ్వే నాకు రూ. ఐదు లక్షలు మనోవర్తి కింద ఇవ్వు. అతడిని నువ్వే ఉంచుకో’ అని చెప్పింది. దీనికి ఒప్పుకున్న సదరు మహిళ నగదు ఇవ్వడానికి ఒక నెల గడుపు కోరింది. దీనికి కూడా ఆ భార్య అంగీకరించింది. పంచాయతీ పెట్టి…వారి ఎదుట చేసుకున్న ఈ ఇద్దరి రాజీ ఒప్పందం పంచాయతీ పెద్దలతో పాటు..  గ్రామస్తులను అవాక్కయ్యేలా చేసింది.

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations