భర్త తనతో మాట్లాడట్లేదని క్షుద్రపూజలు చేయించిన భార్య.. ఎక్కడంటే?

Published : Mar 23, 2023, 01:11 PM IST
భర్త తనతో మాట్లాడట్లేదని క్షుద్రపూజలు చేయించిన భార్య.. ఎక్కడంటే?

సారాంశం

కర్ణాటకలో ఓ మహిళ భర్తపైనే క్షుద్ర పూజలు చేయించింది. భర్త తనతో సరిగా మాట్లాడటం లేదని భావించిన ఆ మహిళ క్షుద్ర పూజలు చేయించింది. ఆమెను బంధువులు, స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

బెంగళూరు: కర్ణాటకలో ఓ అవాంఛనీయ ఘటన జరిగింది. మూఢ నమ్మకాలతో ఓ భార్య పోలీసు స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. క్షుద్ర పూజలను విశ్వసించి హైడ్రామాకు కారణమైంది. భర్త తనతో సరిగా మాట్లాడటం లేదని, క్షుద్ర పూజలు చేయిస్తే తనను బాగా చూసుకుంటాడని, మాట్లాడతాడని ఆమె నమ్మింది. భర్త పైనే క్షుద్ర పూజలు చేయించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

మైసూరు నాచనహళ్లి పాల్యలో ఈ ఘటన జరిగింది. నాచనహళళ్లి పాల్యలో రఫీ, సమ్రీన్ అనే దంపతులు నివాసముంటున్నారు. భర్త రఫీ తనతో సరిగా మాట్లాడటం లేదని భార్య సమ్రీన్ భావించింది. భర్త పైనే క్షుద్ర పూజలు చేయించడానికి సిద్ధమైంది. 

Also Read: ఫుల్‌గా తాగి ఫ్లైట్‌లో వీరంగం.. తోటి ప్రయాణికులు, సిబ్బందితో గొడవ.. బాటిళ్లు లాక్కున్న క్రూ

ఇందులో భాగంగానే ప్రతి అమావాస్య రోజున ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు, ఉప్పు, ఇతర వస్తువులను వేరే వ్యక్తులతో వేయిస్తుండేది. మంగళవారం రాత్రి సమ్రీన్ ఆ వస్తువులను ఇంటి ముందు వేస్తుండగా బంధువుల, స్థానికులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం, విద్యారణ్యపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?