ఫుల్‌గా తాగి ఫ్లైట్‌లో వీరంగం.. తోటి ప్రయాణికులు, సిబ్బందితో గొడవ.. బాటిళ్లు లాక్కున్న క్రూ

Published : Mar 23, 2023, 12:43 PM IST
ఫుల్‌గా తాగి ఫ్లైట్‌లో వీరంగం.. తోటి ప్రయాణికులు, సిబ్బందితో గొడవ.. బాటిళ్లు లాక్కున్న క్రూ

సారాంశం

దుబాయ్ నుంచి ముంబయికి వస్తున్న ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఫుల్‌గా తాగి వీరంగం సృష్టించారు. వారించిన తోటి ప్రయాణికులు, సిబ్బందిని దూషించారు. అందులో ఒకడు బాటిల్ చేతిలో పట్టుకుని తిరుగుతూ మద్యం తాగాడు.  

ముంబయి: ఈ మధ్య కాలంలో విమానంలో అభ్యంతరకర ప్రవర్తన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మద్యం మత్తులో ఫ్లైట్‌లో వీరంగం సృష్టిస్తున్నారు. అందరి భ్రదతను ప్రమాదంలో నెట్టేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దుబాయ్ నుంచి ముంబయికి వచ్చిన ఫ్లైట్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు ఫుల్‌గా మద్యం తాగి తోటి ప్రయాణికులు, సిబ్బందిని దూషించారు. వద్దని వారించినా తాగడం మానలేదు. ఫ్లైట్‌లోనూ బాటిళ్లు పట్టుకుని సీట్ల మధ్య దారిలో తిరుగాడటం చేశారు. దీంతో వారి సిబ్బంది బాటిళ్లు లాగేసుకుంది. ఈ ప్రయాణికులపై ముంబయిలో కేసు ఫైల్ అయింది. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారిని అరెస్టు చేయగా కోర్టు బెయిల్ పై బయటకు వచ్చారని పోలీసులు గురువారం వెల్లడించారు.

దుబాయ్ నుంచి ముంబయికి ప్రయాణిస్తున్న ఫ్లైట్ 6E 1088‌లో ఇద్దరు ప్రయాణికులు మద్యం మత్తులో గొడవకు దిగారని ఇండిగో ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. సిబ్బంది పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయకుండా మద్యం సేవిస్తూనే ఉన్నారని వివరించింది. వారు క్రూ సిబ్బంది, తోటి ప్రయాణికులను దూషించారని తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం ఫ్లైట్‌ ముంబయిలో ల్యాండ్ అయిన తర్వాత వారిని సీఐఎస్ఎఫ్‌కు అప్పగించామని పేర్కొంది. సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని వివరించింది.

Also Read: నా భార్య దోమ కాట్ల వల్ల ఇబ్బంది పడుతోంది.. ఉత్తరప్రదేశ్ పోలీసులకు యువకుడి ఫిర్యాదు.. తరువాత ఏం జరిగిందంటే ?

పోలీసుల వివరాల ప్రకారం, పాల్ఘర్‌లోని నలసపోరా, కొల్హపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు గల్ఫ్‌లో ఏడాదిపాటు పని చేసి ఇంటికి వస్తున్నారు. పన్నులు వేయని షాపులో లిక్కర్ కొనుగోలు చేసి వారిద్దరూ సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు. వారి వల్ల కలుగుతున్న ఇబ్బంది కారణంగా తోటి ప్రయాణికులు వారిని వారించారు. జోక్యం చేసుకున్న సిబ్బందినీ, తోటి ప్రయాణికులను ఆ ఇద్దరు దూషించారు. ఆ ఇద్దరిలో ఒకరు సీట్ల మధ్యల నడుస్తూ బాటిల్ చేతిలో పట్టుకుని మద్యం తాగాడు. సిబ్బంది అతని దగ్గరి నుంచి బాటిల్ తీసుకెళ్లారు. 

సహర్ పోలీసు స్టేషన్‌లో వారిద్దరి పై కేసు ఫైల్ అయింది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?