Bhajan Lal Sharma: తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా సీఎం అయ్యారు.. ఎవరీ భజన్‌లాల్.?

Published : Dec 13, 2023, 12:59 AM IST
Bhajan Lal Sharma: తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా సీఎం అయ్యారు.. ఎవరీ భజన్‌లాల్.?

సారాంశం

Bhajan Lal Sharma: రాజస్థాన్‌లో సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్‌ల పేర్లను ప్రకటించడంతో రాజస్థాన్‌లో ఎన్నికల ఫలితాల నుంచి కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు పూర్తిగా తెరపడింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ రాష్ట్ర సీఎంగా  భజన్ లాల్ శర్మ ను ప్రకటించడం. సీఎం రేసులో చాలా మంది ఉండగా.. బీజేపీ భజన్ లాల్ శర్మ పేరును ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ భజన్ లాల్ ఎవరీ..? ఆయన నేపథ్యమేంటీ?

Bhajan Lal Sharma: రాజస్థాన్‌లో ఎన్నికల ఫలితాల నుంచి కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు పూర్తిగా తెరపడింది. రాజస్థాన్‌లో సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్‌ల పేర్లను ప్రకటించడంతో తెర చాటు రాజకీయాలకు బ్రేక్ పడింది. అయితే.. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజస్తాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ పేరు చర్చకు వచ్చింది. వాస్తవానికి చాలా మంది సీఎం పదవి రేసులో ఉన్నారు.  

అయితే బీజేపీ భజన్ లాల్ శర్మ పేరును ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ కొత్త పేర్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్‌లో కూడా అదే జరిగింది. బీజేపీ అధిష్టానం ప్రకటనతో భజన్‌లాల్ శర్మ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో భజన్‌లాల్ శర్మ పేరును ఆమోదించారు. భజన్‌లాల్ శర్మ సంగనేర్ నుండి ఎమ్మెల్యే, రాజస్థాన్‌లోని బిజెపి ప్రధాన కార్యదర్శి.
 
ఇంతకీ భజన్‌లాల్ శర్మ ఎవరు?

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి, భజన్‌లాల్ శర్మ భరత్‌పూర్ నివాసి కాగా, పార్టీ ఆయనకు జైపూర్‌లోని సంగనేర్ అసెంబ్లీ నుండి టిక్కెట్ ఇచ్చింది. భజన్‌లాల్ శర్మ తండ్రి పేరు కృష్ణ స్వరూప్ శర్మ. భజన్‌లాల్ శర్మ వయస్సు 56 సంవత్సరాలు. భజన్‌లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జైపూర్‌లోని సంగనేర్ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఆయనకు టికెట్ ఇవ్వాలని, సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ లౌహతి టికెట్‌ను బీజేపీ రద్దు చేసింది.

భజన్‌లాల్ శర్మ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. భజన్‌లాల్ శర్మ సంఘ్‌కు చాలా సన్నిహితుడిగా పరిగణించబడతారు. పార్టీపై కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. భజన్‌లాల్ శర్మ జనరల్ కేటగిరీ నుండి వచ్చారు. భజన్‌లాల్ శర్మ రాజస్థాన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి సీఎం అయిన మనోహర్ లాల్ ఖట్టర్ తర్వాత భజనలాల్ శర్మ రెండో సీఎం కావడం గమనార్హం.

ఆయనకు చాలా కాలంగా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నారు. అతను నాలుగు వేర్వేరు సందర్భాలలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఇది సంస్థ పట్ల తన నిబద్ధతను మరియు భక్తిని ప్రదర్శించింది. భజన్ లాల్ శర్మ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన అట్టడుగు స్థాయి వ్యక్తి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదిగారు. తరువాత, అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) క్రియాశీల సభ్యునిగా కూడా మారాడు. భజన్ లాల్ తన చిత్తశుద్ధి , ప్రజా సేవ పట్ల అంకితభావం కారణంగా ప్రజలలో ప్రసిద్ధి చెందాడు.

 
రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ రాజస్థాన్ రాజకీయాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. అతని అనుభవం, దార్శనికత రాజస్థాన్ రాజకీయ దృశ్యాన్ని రూపొందిస్తుంది. అయితే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేటప్పుడు అతను ఎదుర్కొనే సవాళ్లు , కష్టాలను ప్రస్తావించకపోవడం అన్యాయం. రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మను నియమించడం చర్చనీయాంశమైంది. రాజస్థాన్ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడిగా ఆయనపై భిన్నమైన అంచనాలు ఉన్నాయి.  


ఇదిలా ఉంటే.. విద్యాధర్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ దియా కుమారి డిప్యూటీ సీఎం అయ్యారు. డూడూ ఎమ్మెల్యే ప్రేమ్ చంద్ బైరవ రెండో డిప్యూటీ సీఎం కానున్నారు. అదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా అజ్మీర్ నార్త్ ఎమ్మెల్యే వాసు దేవనాని బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ నుంచి దియా కుమారి 71,368 ఓట్లతో గెలుపొందారు. అదే సమయంలో.. డూడూ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన బాబులాల్ నగర్‌పై ప్రేమ్ చంద్ బైర్వా 35,743 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

అలాగే..అజ్మీర్ నార్త్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ రాలవాతపై వాసు దేవ్నానీ 46,44 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇలా మూడు రాష్ట్రాల సీఎంలను ప్రకటనతో ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ నుంచి వసుంధర రాజే, ఛత్తీస్ గఢ్ నుంచి రమణ్ సింగ్ ల శకం ముగిసింది. భజన్‌లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా 15 డిసెంబర్ 2023న ప్రమాణ స్వీకారం చేస్తారు. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 115, కాంగ్రెస్‌కు 69, భారతీయ గిరిజన పార్టీకి 3, బీఎస్పీకి 2, ఆర్‌ఎల్‌డీకి 1, ఆర్‌ఎల్‌పీకి 1, స్వతంత్రులకు 8 సీట్లు వచ్చాయి.  

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?