అయోధ్యకు, ధనుష్కోడికి మధ్య సంబంధం ఏంటి ? ప్రధాని అక్కడ పూజలెందుకు చేశారు ? (ఫొటోలు)

Published : Jan 21, 2024, 12:58 PM ISTUpdated : Jan 21, 2024, 01:00 PM IST
అయోధ్యకు, ధనుష్కోడికి మధ్య సంబంధం ఏంటి ? ప్రధాని అక్కడ పూజలెందుకు చేశారు ? (ఫొటోలు)

సారాంశం

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ (ayodhya ram mandir pran pratishtha) వేడుక జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రామేశ్వరం ధనుష్కోడి (Rameswaram Dhanushkodi)గురించి శోధిస్తున్నారు. అసలు ఉత్తరాన యూపీ (uttar pradesh)లో ఉన్న అయోధ్యకు, దక్షిణాన తమిళనాడు (Tamilnadu) లో ఉన్న ధనుష్కోడికి మధ్య ఉన్న సబంధం ఏమిటి ? ప్రధాని నరేంద్ర మోడీ ( Performs Puja At Sri Kothandarama Swamy Temple In Dhanushkodi) అక్కడికి వెళ్లి ఎందుకు పూజలు చేశారు.. ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ కథనంలో దొరుకుతుంది.

అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న (రేపు) ఘనంగా జరగనుంది. దీని కోసం ప్రధాని మోడీ 11 రోజులుగా కఠిన ఉపవాసం చేస్తున్నారు. అలాగే దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా రామాలయాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా మూడు రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు వచ్చిన ప్రధాని మోదీ నిన్న (శనివారం) తిరుచ్చిలోని శ్రీరంగం ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రామేశ్వరం అగ్ని తీర్థ సముద్రంలో పుణ్యస్నానం చేశారు. అనంతరం ఆలయంలోని మొత్తం 22 తీర్థాల్లో పుణ్యస్నానం ఆచరించారు. 

కాగా.. ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ధనుష్కోడికి వెళ్లారు. అక్కడ అరిచల్ నోడి బీచ్‌లో ప్రాణాయామం చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ధనుష్కోడి గోతండ రామ మందిరంలో స్వామివారిని దర్శించుకున్నారు. అయితే అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో చాలా మంది దక్షిణాదిలోని రామేశ్వరం ధనుష్కోడి ఎరోషన్ పాయింట్ కు, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు మధ్య సంబంధం ఏంటంని శోధిస్తున్నారు. 

 

రామేశ్వరంలోని అనేక ప్రసిద్ధ ప్రదేశాలు రామాయణంతో ముడిపడి ఉన్నాయి. తమిళనాడులోని ఏకైక జ్యోతిర్లింగం రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి ఆలయంలో ఉంది. ముఖ్యంగా ధనుష్కోడి చారిత్రాత్మకంగా.. ఆధ్యాత్మికంగా అయోధ్యతో ముడిపడి ఉంది. ధనుష్కోడి బంగాళాఖాతం, మన్నార్ బే మధ్య ఏర్పడిన సహజ సిద్ధమైన ప్రదేశం. విల్లు ఆకారంలో ఉన్న తీరప్రాంతం కారణంగా దీనికి ధనుష్కోడి అని పేరు వచ్చింది. శ్రీరాముడు తన ధనుస్సును ఉంచిన ప్రదేశం అని, అందుకే దీనిని ధనుష్కోడి అని అంటారని చెబుతారు.

ఓటుకు నోటు ఎమ్మెల్సీ అభ్యర్థికి కేబినెట్ ర్యాంక్ ... ఆ పదవులన్నీ రేవంత్ సన్నిహితులకే...

అయితే ధనుష్కోడి 1964లో వచ్చిన తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ ఈ ప్రాంతపు చారిత్రక వైభవం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ధనుష్కోడిలో రాముడు రావణుని సంహరించాలని సంకల్పించాడని చెబుతారు. శివ భక్తుడైన రావణుడిని సంహరించిన తర్వాత రాముడు చెడును నివారించడానికి సముద్రతీరంలోని మట్టిలో శివలింగాన్ని తయారు చేసి శివుని పూజించాడని అంటారు. అయోధ్యలోని శివలింగం రామేశ్వరంలో ప్రతిష్టించారు. రామేశ్వరం పవిత్ర తీర్థం రామాయణ కాలంలో అయోధ్యకు వెళ్ళింది.

ధనుష్కోడి దక్షిణ కొన అరిచాల్మున్య వద్ద, శ్రీరామునిచే ప్రతిష్టించబడిన శివలింగం, నందితో కూడిన చిన్న ఆలయం ఉంది. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు సీతతో వెలిశారు. శ్రీలంకలోని మన్నార్ ప్రాంతంలో అరిచాల్మున్యా నుంచి శ్రీరాముడు సేతు పాలం నిర్మించాలని ప్లాన్ చేసినట్లు కూడా చెబుతారు.

రామేశ్వరం నుండి ధనుష్కోడి అరిచల్ పాయింట్‌కి వెళ్ళే మార్గంలో, శ్రీకోతండరామ దేవాలయం రెండు వైపులా సముద్రపు నీటితో చుట్టుముట్టబడి ఉంది. ఇక్కడే విభీషణుడు తనకు సహాయం చేయడానికి శ్రీరాముని ఆశ్రయం పొందాడని నమ్ముతారు. యుద్ధంలో రావణుడిని ఓడించిన తరువాత, ఆయన తమ్ముడు విభీషణుడికి ఇక్కడే శ్రీలంకకు రాజుగా పట్టాభిషేకం జరిగిందని కూడా చెబుతారు.

ఈ ఆలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత ఉత్సవ మూర్తులుగా దర్శనమిస్తారు. ఇక్కడ విభీషణుడు తన దగ్గర ఆంజనేయుడు లేకుండా రాముడిని పూజిస్తున్నట్లు చూపబడింది. ఈ ఆలయాన్ని విభీషణుడు నిర్మించాడని చెబుతారు. ప్రతీ సంవత్సరం శ్రీరాముడు మేల్కొని గోతండరామ ఆలయంలో విభీషణునికి పట్టాభిషేకం చేసే ఆచారం నేటికీ వైభవంగా సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway