ప్రశాంతమైన సరయూ ఘాట్‌లో రామాయణ వీక్షణం ఓ అద్భుతమైన అనుభూతి.. మీరూ చూడండి (వీడియో)

By SumaBala BukkaFirst Published Jan 2, 2024, 1:22 PM IST
Highlights

ప్రతి సాయంత్రం, నదీతీరంలో ఉన్న ప్రొజెక్టర్ స్క్రీన్ 20 నిమిషాల నిడివిగల రామాయణ కథనంతో జీవం పోసుకుంటుంది, వేలాది మంది భక్తులను ఆకర్షించి, మంత్రముగ్ధులను చేస్తుంది. ఆధ్యాత్మికత, భక్తితో నిండిన వాతావరణంతో ఈ ప్రాంతం విరాజిల్లుతుంది. 

అయోధ్యలో మరో అద్బుతమైన అనుభవం రామాయణ ప్రదర్శన. సుందరమైన సరయూ నది ఒడ్డున లైట్ అండ్ సౌండ్ షో తో అతిపెద్ద స్క్రీన్ మీద అద్బుతంగా రామాయణ ఇతివృత్తాన్ని ప్రదర్శించడం మరిచిపోలేని అనుభూతిగా మారుతుంది. మంత్రముగ్ధులను చేసే ఈ ప్రదర్శనను శాశ్వత ఆకర్షణగా చేయనున్నారు. ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎడిటర్ అజిత్ హనమక్కనవర్ ఎగ్జిక్లూజివ్ గా ఈ ప్రదర్శనను చిత్రబద్ధం చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 20 నిమిషాలపాటు ఈ ప్రదర్శన భక్తులను ఆకర్షిస్తున్నారు.

Latest Videos

ప్రతి సాయంత్రం, నదీతీరంలో ఉన్న ప్రొజెక్టర్ స్క్రీన్ 20 నిమిషాల నిడివిగల రామాయణ కథనంతో జీవం పోసుకుంటుంది, వేలాది మంది భక్తులను ఆకర్షించి, మంత్రముగ్ధులను చేస్తుంది. ఆధ్యాత్మికత, భక్తితో నిండిన వాతావరణంతో ఈ ప్రాంతం విరాజిల్లుతుంది. రామాయణం ప్రొజెక్షన్‌ను చూసేందుకు వేలాది మంది భక్తులు అద్భుతానుభవంగా మారుతుంది. 

రామాయణ ఘట్టాలకు సంబంధించిన సౌండ్ సిస్టమ్ ఘాట్ అంతటా ప్రతిధ్వనిస్తుంది. రామాయణంఉద్వేగభరితమైన కథనాన్ని విస్తరింపజేస్తుంది, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

అయోధ్య నడిబొడ్డున రామభక్త హనుమాన్ ఆలయం ఉంది. శ్రీరాముడి వీర భక్తుడు హనుమంతుడు. హనుమంతుడి పేరు లేకుండా రామాయణం లేదు. రాముడిని తలుచుకుంటే హనుమంతుడు గుర్తుకు రాకుండా ఉండడు. 

ఏసియానెట్ ఎక్స్ క్లూజివ్ : అయోధ్య ఎంత అద్భుతంగా మారిపోయిందో చూడండి.. (వీడియో)

అయోధ్య సాంస్కృతిక పునర్జీజీవనంలో.. అయోధ్య ప్రకృతి దృశ్యంలో పరివర్తనాత్మక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది ఒకప్పుడు నిరాడంబరమైన 10 అడుగుల రహదారిగా ఉన్న రోడ్డు ఇప్పుడు 80-అడుగుల విశాలమైన మార్గంగా మారింది. అయోధ్య వేగంగా మారుతున్న పట్టణ అభివృద్ధికి చిహ్నం. కొత్త దారులు కాంక్రీటుతో నల్లేరుమీద నడకలా మారాయి.

పురాణ రామాయణ ఇతిహాసం స్ఫూర్తితో కొనసాగుతున్న నిర్మాణ పునరుజ్జీవనం కూడా హైలైట్ చేయబడింది. అయోధ్యలోని గృహాలు,భవనాలు పునర్నిర్మాణంలో ఉన్నాయి. ఇవి రాబోయే ఉత్సవానికి ఉత్సాహం, నిరీక్షణను పెంచుతున్నాయి. ప్రత్యేకించి జనవరి 22 కంటే ముందు దేశం అయోధ్యపై దృష్టి పెట్టడానికి సన్నద్ధమవుతోంది.

click me!