వీడియో వైరల్.. రైల్వేట్రాక్ పై రాళ్లు పెట్టిన పిల్లోడు.. ఇందులో నిజమెంతా..?

By Rajesh KarampooriFirst Published Jun 5, 2023, 10:48 PM IST
Highlights

ఇటీవల ఓ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్  అవుతుంది. అందులో ఓ కుర్రాడు రైలు పట్టాలపై రాళ్లు పెడుతూ.. పట్టుబడ్డాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..  

ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. రైలు పట్టాలపై ఒక పిల్లవాడు రాళ్లు వేస్తున్న వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ పిల్లవాడు రైల్వే పట్టాలపై రాళ్లతో ఆడుతూ.. ట్రాక్‌పై వరుసగా రాళ్లను పెట్టారు. ఆ పిల్లవాడి పోకిరీ చేష్టాలు చూసిన ట్రాక్‌మ్యాన్స్ నిర్గంతపోయారు. ఆ పిల్లవాడిని పట్టుకుని.. ఓ రెండు తగిలించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా.. ఆ పిల్లవాడితోనే ఆ రాళ్లను తొలిగించారు. ఆ పిల్లవాడు కూడా మరోసారి ఇలాంటి పని చేయనని వారికి చెప్పడం చూడవచ్చు. ఈ సంఘటన కర్ణాటక లోని కలబురగి మెయిన్ స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో ఉన్న హిరేనందూరులో చోటు చేసుకుంది.

వాస్తవానికి ఈ వీడియో చాలా పాతది. మే 12, 2018న ఫేస్‌బుక్ పోస్ట్‌ చేయబడింది. ఆ వీడియోను అరుణ్ పుదూర్ (@arunpudur) అనే నెటిజన్ జూన్ 5న షేర్ చేస్తూ.. "షాకింగ్: మరో రైలు ప్రమాదం తప్పింది. కర్ణాటకలో రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేస్తూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. మనకు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. కొందరూ విధ్వంసం చేయడానికి  పిల్లలను ఉపయోగిస్తున్నారు. ఇది తీవ్రమైన సమస్య."అని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు  ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా చూడగా.. 4 వేలకు పైగా రీట్వీట్ చేయబడింది. 
 
మురికివాడకు చెందిన ఓ పిల్లవాడు ట్రాక్ దగ్గర రాళ్లు వేసి ఆడుకుంటున్నారు. మతపరమైన వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారని, అయితే రైలును పాడు చేయాలనే ఉద్దేశ్యం పిల్లలకు లేదని ఆయన అన్నారు. అక్కడ ఉన్న ట్రాక్‌మ్యాన్ అబ్బాయిలను మందలించాడని, కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టారు కూడా. 

⚠️ Shocking: Another Averted.

An underage boy was caught sabotaging the railway Track this time in .

We have tens of thousands of Kms of railway tracks and forget adults now even kids are being used for sabotaging and causing deaths.

This is a serious… pic.twitter.com/URe9zW4NgG

— Arun Pudur (@arunpudur)

ఇదిలా ఉంటే.. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని కదిలించింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ప్రమాదంలోని బాధిత కుటుంబాలను గుర్తించడంలో సహాయపడటానికి.. ఒడిశా ప్రభుత్వంతో సమన్వయంతో రైల్వే శాఖ మరణించిన వారి ఫోటోలు, వివిధ ఆసుపత్రులలో చేరిన ప్రయాణీకుల జాబితాలతో మూడు ఆన్‌లైన్ లింక్‌లను సిద్ధం చేసింది.

ఈ రైలు ప్రమాదంలో బంధువుల ఆచూకీ గురించి ఇంకా తెలియని వారి కుటుంబాలకు సహయం చేయడానికి ఒడిశా ప్రభుత్వం మద్దతుతో భారతీయ రైల్వే వారిని గుర్తించడానికి చొరవ తీసుకుంది. కుటుంబ సభ్యులు/బంధువులు/ ఈ దురదృష్టకర ప్రమాదంలో ప్రభావితమైన ప్రయాణీకుల స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ క్రింది వివరాలను ఉపయోగించి మరణించిన వారి ఫోటోలు, వివిధ ఆసుపత్రుల్లో చేరిన ప్రయాణీకుల జాబితాలు , గుర్తుతెలియని మృతదేహాలను ఆన్ లైన్ లింక్‌ను ఉపయోగించి గుర్తించవచ్చనిరైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

అదనంగా.. ఈ రైలు దుర్ఘటన వల్ల ప్రభావితమైన ప్రయాణికుల కుటుంబాలు,బంధువులను రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 కనెక్ట్ చేయడానికి 24/7 సిబ్బందిని కలిగి ఉందని పేర్కొంది. అలాగే 24/7 భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్‌లైన్ నంబర్ 18003450061/1929 అందుబాటులో ఉంటుందని తెలిపింది.

click me!