బ్యాంకు మేనేజ‌ర్ పై యాసిడ్ దాడి.. రంగంలోకి దిగిన పోలీసులు.. !

Published : Aug 09, 2022, 10:54 AM IST
బ్యాంకు మేనేజ‌ర్ పై యాసిడ్ దాడి.. రంగంలోకి దిగిన పోలీసులు.. !

సారాంశం

Uttar Pradesh: ఓ బ్యాంక్ మేనేజ‌ర్ పై యాసిడ్ దాడి జ‌రిగింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లాలోని ఒక గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.  

Acid Attack  in Uttar Pradesh's Kaushambi:  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఓ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ బ్యాంకులో మేనేజ‌ర్ గా ప‌నిచేస్తున్న మ‌హిళ‌పై ఇద్దరు వ్య‌క్తులు యాసిడ్ దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలికి గాయాల‌య్యాయి. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సోమవారం నాడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని చార్వా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై యాసిడ్ పోయడంతో సీనియర్ బ్యాంక్ మేనేజర్‌కు కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆమెను ప్రయాగ్‌రాజ్‌లో నివసిస్తున్న దీక్షా సోంకర్ (34)గా గుర్తించారు. కౌశాంబి జిల్లాలోని చైల్ తహసీల్‌లోని సయ్యద్ సరావా గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆమె డ్యూటీకి వెళుతుండగా చిల్లా షాబాజీ గ్రామ సమీపంలో ఇద్దరు యువకులు ఆమె స్కూటర్‌ను ఆపి ఆమె ముఖంపై యాసిడ్ పోశారని పోలీసులకు సమాచారం అందిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హేమ్‌రాజ్ మీనా తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెపై యాసిడ్ పోసిన‌ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని ప‌లువురు ప్ర‌త్య‌క్ష సాక్షులు చూశార‌ని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించేందుకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్ల‌డించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu