UP GBC : నవంబర్‌లో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా యోగి సర్కార్ మాస్టర్ ప్లాన్

Published : Sep 18, 2025, 10:37 PM ISTUpdated : Sep 18, 2025, 10:39 PM IST
UP GBC

సారాంశం

UP GBC : నవంబర్‌లో జరగబోయే 5వ గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మనీ (GBC@5) కి పకడ్బందీగా ఏర్పాట్లకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ₹5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, ఉపాధి జోన్లు, ఫిన్‌టెక్ హబ్, ఎగుమతుల ప్రోత్సాహంపై దృష్టి పెడతారు.

UP GBC : ఐదవ గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మనీ (GBC@5)ని నవంబర్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఇందులో ₹5 లక్షల కోట్లకు పైగా ప్రైవేట్ పెట్టుబడి ప్రాజెక్టులు ఉంటాయి. "రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్" అనే మంత్రంతో గడిచిన ఎనిమిదిన్నర ఏళ్లలో ఇప్పటివరకు నాలుగు గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మనీలు జరిగాయని ఆయన అన్నారు. వీటి ద్వారా ₹15 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి… 60 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించిందని సీఎం యోగి వెల్లడించారు.

భూసేకరణలో రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత

భూసేకరణ సామరస్యంగా, చర్చల ద్వారా జరగాలని ముఖ్యమంత్రి యోగి అధికారులను ఆదేశించారు. రైతులకు వారి భూమికి సరైన, మంచి పరిహారం ఇవ్వాలని… ఎలాంటి వేధింపుల ఫిర్యాదులు రాకూడదన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ప్రాధికార సంస్థలు తమ ప్రాంతాల్లో పరిహారం రేటును పెంచే విషయం ఆలోచించాలి, దీనివల్ల రైతుల ప్రయోజనాలు కాపాడబడతాయన్నారు.

ఎగుమతులు, ఫిన్‌టెక్ హబ్ అభివృద్ధి

సీఎం యోగి ఎగుమతులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు.

  • నోయిడా, గ్రేటర్ నోయిడా లేదా యమునా అథారిటీలో ఏదో ఒక ప్రాంతంలో ఫిన్‌టెక్ హబ్ అభివృద్ధి చేస్తారు.
  • ఇక్కడ పెద్ద బ్యాంకింగ్ సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు.
  • ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి కూడా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తారు.

భూమి సరైన వినియోగం, పెట్టుబడిదారులకు సౌకర్యం

భూమి కేటాయించిన తర్వాత మూడేళ్ల వరకు ఉపయోగించని యూనిట్ల భూమిని వెనక్కి తీసుకుని, ఇతర పెట్టుబడిదారులకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఇన్వెస్ట్ మిత్ర, ఇన్వెస్ట్ సారథి పోర్టళ్లను మరింత సులభతరం చేయాలని ఆదేశించారు. పెట్టుబడిదారుడు చిన్నవాడైనా, పెద్దవాడైనా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకూడదని ఆయన అన్నారు.

జీఎస్టీ సంస్కరణలు, ప్రజలకు ప్రయోజనం

సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే కొత్త జీఎస్టీ సంస్కరణల ప్రత్యక్ష ప్రయోజనం ప్రజలకు అందాలని ముఖ్యమంత్రి తెలిపారు. దీన్ని అధికారులు నిర్ధారించాలని ఆయన ఆదేశించారు.

ప్రత్యేక ఉపాధి జోన్ల ప్రణాళిక

ప్రతి జిల్లాలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఉపాధి జోన్‌ను అభివృద్ధి చేయాలని సమావేశంలో చర్చించారు.

  • ఇది కనీసం 100 ఎకరాల భూమిలో ఏర్పాటు అవుతుంది.
  • ఇక్కడ పరిశ్రమలు, పెట్టుబడులు, వ్యవస్థాపకత, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహం లభిస్తుంది.
  • ఈ పథకం దేశం మొత్తానికి ఒక మోడల్‌గా నిలుస్తుంది.

తయారీ రంగం లక్ష్యం

2025-26 నాటికి ₹5 లక్షల కోట్ల GVA లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమావేశంలో తెలిపారు. దీనికోసం 8,000 కొత్త/ప్రస్తుత పారిశ్రామిక యూనిట్ల రిజిస్ట్రేషన్ అవసరం. ఇప్పటివరకు 1,354 యూనిట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. కార్మిక సంస్కరణల వేగాన్ని పెంచాలని, ఉపయోగించని పారిశ్రామిక ప్లాట్లను యాక్టివేట్ చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rush at Sabarimala Temple అయ్యప్ప స్వాములతో కిటకిట లాడిన శబరిమల | Asianet News Telugu
దేశంలోని 55 శాతం సెల్ ఫోన్లు తయారయ్యేది ఎక్కడో తెలుసా?