PM Modi: రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ప్రధాని మోడీ నివాసంలో నిర్వహణ!

Published : Nov 27, 2023, 09:05 PM IST
PM Modi: రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ప్రధాని మోడీ నివాసంలో నిర్వహణ!

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ చేయనున్న తరుణంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల ముంగిట్లో ఈ భేటీ జరుగుతున్నది. దీంతో ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రేపు సాయంత్రం 6 గంటలకు మంత్రి మండలి సమావేశం, 8 గంటలకు యూనియన్ కౌన్సిల్ సమావేశం కూడా జరగనున్నట్టు తెలిసింది. ఈ సమావేశాలు కూడా లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడీ నివాసంలోనే జరగనున్నాయి.

కేంద్ర క్యాబినెట్ సమావేశానికి గల అజెండా ఇంకా తెలియరాలేదు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంలో ఈ భేటీ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు కేంద్రమంత్రి వర్గ సమావేశం జరుగుతున్నది.

Also Read : Tejas: ప్రధాని మోడీ ప్రయాణించాడుగా.. తేజస్ జెట్ క్రాష్ అవుతుంది: టీఎంసీ ఎంపీ షాకింగ్ కామెంట్.. బీజేపీ ఫైర్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే జాతీయ పార్టీలకు సహజంగానే నెక్స్ట్ టార్గెట్ లోక్ సభ ఎన్నికలే. అందుకే ఈ క్యాబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఉన్నది. లోక్ సభ ఎన్నికల కసరత్తు కోసం కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేపథ్యం లోనూ జరుగుతున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !