కూతురిని రేప్ చేశాడని కేసు: చెట్టుకు వేలాడుతూ వ్యక్తి శవం

By telugu teamFirst Published Jun 2, 2021, 8:36 PM IST
Highlights

త్రిపుర నార్త్ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కూతురిపై అత్యాచారం చేశాడని అతనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్థితిలో అతని శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

అగర్తల: త్రిపుర నార్ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. చెట్టుకు ఉరేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. 

17 ఏళ్ల వయస్సు గల కన్నకూతురిపై రెండు రోజుల క్రితం అత్యాచారం చేశాడని ఆ వ్యక్తిపై కుటంబ సభ్యులు సోమవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారంనాడు ఇంటికి కొద్ది దూరంలో అతని శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. 

వ్యక్తి మృతిపై ప్రాథమిక విచారణ జరుగుతుందని పోలీసులు చెప్పారు. అది ఆత్మహత్యనా, హత్యనా అనే విషయాన్ని తేల్చడానికి విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ బునపద చక్రవర్తి తెలిపారు. 

మృతుడు దినసరి కూలీ. శుక్రవారం అతను కూతురిపై అత్యాచారం చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

click me!