త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు: ప్రజాస్వామ్య పండుగలో పెద్ద సంఖ్య‌లో పాల్గొనండి..: ఓటర్లకు జేపీ నడ్డా విజ్ఞప్తి

Published : Feb 16, 2023, 10:07 AM ISTUpdated : Feb 16, 2023, 10:11 AM IST
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు: ప్రజాస్వామ్య పండుగలో పెద్ద సంఖ్య‌లో పాల్గొనండి..: ఓటర్లకు జేపీ నడ్డా విజ్ఞప్తి

సారాంశం

Tripura Elections 2023:  త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ గురువారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప్రారంభ‌మైంది. మొత్తం 28.14 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో 14,15,233 మంది పురుష ఓటర్లు, 13,99,289 మంది మహిళా ఓటర్లు, 62 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,337 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది.  

BJP National President JP Nadda: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం  అయింది. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని అంద‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ గురువారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప్రారంభ‌మైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ గురువారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప్రారంభ‌మైంది. మొత్తం 28.14 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో 14,15,233 మంది పురుష ఓటర్లు, 13,99,289 మంది మహిళా ఓటర్లు, 62 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,337 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది.

ఈ నేప‌థ్యంలోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ప్ర‌తిఒక్క‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని అంద‌రూ పాలుపంచుకోవాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. "త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల ఓటింగ్ లో అంద‌రూ పాలుపంచుకోవాలి. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పాల్గొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సుపరిపాలన, అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించడానికి, సుసంపన్న త్రిపుర‌ను నిర్మించ‌డానికి ప్రతి ఓటు కీల‌కంగా ఉంటుంది" అని జేపీ న‌డ్డా అన్నారు. 

కాగా, 60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీకి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, శాంతియుత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) గిట్టె కిరణ్ కుమార్ దినకర్రో తెలిపారు. 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతుందని, వీటిలో 1,100 సున్నితమైనవి, 28 సమస్యాత్మకమైనవిగా గుర్తించామని ఆయ‌న‌ తెలిపారు. అలాగే, రాష్ట్రంలో మొత్తం 97 మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి ప‌రిధిలో 18-19 ఏళ్ల వారు 94,815 మంది ఓట‌ర్లు, 22-29 ఏళ్ల వారు 6,21,505 మంది ఉన్నారు. అత్యధికంగా 40-59 ఏళ్ల మధ్య వయస్కులు 9,81,089 మంది ఉన్నారు.60 అసెంబ్లీ స్థానాల్లో 259 మంది అభ్యర్థుల భవితవ్యం త్వ‌ర‌లోనే తేలనుంది.

ఈ ఏడాది ఎన్నికలు జరిగిన తొలి రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగనుండగా, 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో ఐదు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో 20 మంది మహిళలు సహా మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి భారతీయ జనతా పార్టీ 12 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. 2018కు ముందు త్రిపురలో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీ గత ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి 1978 నుంచి 35 ఏళ్లుగా సరిహద్దు రాష్ట్రంలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ను గద్దె దించింది.

2018 ఎన్నికల్లో బీజేపీకి 43.59 శాతం ఓట్లు వచ్చాయి. సిపిఐ (ఎం) 42.22 శాతం ఓట్లతో 16 స్థానాలను గెలుచుకుంది. ఐపీఎఫ్టీ 8 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. తమ పనితీరును మెరుగుపరుచుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్టీ చీఫ్ జేపీ నడ్డా సహా పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు త్రిపురవి సైతం మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu