అత్యంత వృద్ద మగ జెయింట్ పాండా యాన్ మృతి.. ప్ర‌పంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన సంతాప సందేశాలు

Published : Jul 22, 2022, 02:19 PM IST
అత్యంత వృద్ద  మగ జెయింట్ పాండా యాన్ మృతి.. ప్ర‌పంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన సంతాప సందేశాలు

సారాంశం

అత్యంత పురాతన మగ పాండా గురువారం చనిపోయింది. మానవుల సంరక్షణలో ఉన్న ఆ పాండాకి 35 ఏళ్ల వయస్సు. అయితే అది మనుషుల వయస్సుతో పోల్చినప్పుడు 105 ఏళ్లకు సమానం అని హాంకాంగ్ థీమ్ పార్క్‌ అధికారులు వెల్లడించారు. 

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మగ జెయింట్ పాండా అయిన యాన్ ఆన్ మరణించింది. అయితే దీని మృతి ప‌ట్ల ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వెల్లువెత్తాయి. 35 సంవత్సరాల వయస్సులో ఆరోగ్య సమస్యల వ‌ల్ల ఈ పాండా హాంకాంగ్ థీమ్ పార్క్‌లో గురువారం చ‌నిపోయింది. దీని వ‌య‌స్సు మానవ‌ వయస్సులో 105 సంవత్సరాలకు సమానం. ‘‘ ఈ రోజు (21 జూలై 2022) మానవ సంరక్షణలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన మగ జెయింట్ పాండా అయిన శతాబ్ది పాండా యాన్ అన్‌ను కోల్పోయినట్లు ప్రకటించినందుకు మేము చాలా బాధపడ్డాము. ’’ అని ఓషన్ పార్క్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది.

Fake news: 747 వెబ్ సైట్ల‌ను, 94 యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకంటే?

గత కొన్ని వారాల నుంచి ఆ పాండా శారీరక కార్యకలాపాలు నెమ్మ‌దించాయి. అలాగే చాలా త‌క్కువ‌గా ఆహారం తీసుకుంది. దీంతో యాన్ ఆన్ ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని థీమ్ పార్క్ అధికారులు తెలిపారు. ఆన్‌ మరణించిందనే వార్త ఇంటర్నెట్‌లో వ్యాపించిన తర్వాత థీమ్ పార్క్‌లోని ఫేస్‌బుక్ పేజీలో ప్రపంచం నలుమూలల నుండి ఆ పాండాపై ప్రేమ వెల్లువెత్తింది. ‘‘An Anతో పాటు వచ్చిన HK పిల్లలకు మా ధన్యవాదాలు! మీరు వారి పట్ల చాలా శ్రద్ధగా ప్రేమ వహించారు. సంవత్సరాలుగా మీరు పాండా సంరక్షకులు! మీ పని చాలా అభినందనీయం ! ధన్యవాదాలు’’ అని కేజీ లాస్ట్ అనే సోషల్ మీడియా యూజర్లు పేర్కొన్నారు. 

Amendment to Flag Code: "వారి జీవనోపాధిని నాశనం చేస్తున్నారు".. ఫ్లాగ్ కోడ్ సవరణపై జైరాం రమేష్ ఆగ్ర‌హం

ఇండియాకు చెందిన సిమ్రాన్ సోఖీ ‘‘ రెస్ట్ ఇన్ పీస్ యాన్. స్లీప్ వెల్ మిస్టర్ హాంగ్ మావో ’’ అని పేర్కొన్నారు. US కు చెందిన మరో యూజర్ జూడీ మెక్‌కాయ్-చావీరా మాట్లాడుతూ.. ‘‘ దేవుని అత్యంత అందమైన జీవులలో ఒకటి.. శాంతితో విశ్రాంతి తీసుకోండి.. మీ కోసం శ్రద్ధ వహించిన సిబ్బందికి, ఈ అత్యంత క్లిష్ట సమయంలో దేవుడు ప్రేమ, ఆశీర్వాదాలను అందిస్తాడు.’’ అని పేర్కొన్నారు. ఆలిస్ థండర్‌ల్యాండ్ అనే యూజర్ ‘‘ శాంతి, ఆనందంలో విశ్రాంతి తీసుకోండి. యాన్ మిమ్మల్ని నేను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను. మిస్ అవుతున్నాను.’’ అని పేర్కొన్నారు. హాంకాంగ్ ప్రజలకు ఆనందాన్ని అందించినందుకు పుయ్ వాంగ్ త్సుయ్ యాన్ అన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్ గుణవర్ధనే: ప్రమాణం చేసిన కొత్త పీఎం

జెయింట్ పాండాలు బందీగా ఉన్న‌ప్పుడు సంతానోత్పత్తి చేయడం కష్టం. అయినప్పటికీ కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత ఇటీవలి కాలంలో వాటి సంఖ్య పెరిగింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ప్రకారం.. గత దశాబ్దంలో దాని జనాభా దాదాపు 17 శాతం పెరిగింద‌ని పేర్కొంది. దీంతో ఈ జాతి 2017లో ‘‘అంతరించిపోతున్న జాతుల’’ నుంచి ‘‘హాని ఉన్న జాతులు’’గా అప్ గ్రేడ్ అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu