డెంగ్యూ టెర్రర్: ప్లేట్‌లెట్స్ దాతల కోసం గోద్రెజ్ హెల్ప్‌లైన్

By Siva KodatiFirst Published Sep 24, 2019, 3:25 PM IST
Highlights

ప్రముఖ కార్పోరేట్ సంస్థ గోద్రేజ్ సైతం డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దానితో పాటు ప్లేట్ లెట్స్ కావాల్సిన వారికి, ప్లేట్ లెట్స్ డోనర్లకు వారధిగా ఉండేందుకు ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. 

డెంగ్యూ కేసులతో కర్ణాటక చివురుటాకులా వణికిపోతోంది. ఇప్పటి వరకు దాదాపు 6,110 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఒక్క బెంగళూరు నగరంలోనే 3,882 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో దోమలు బాగా వృద్ధి చెందాయి.

డెంగ్యూ కారణంగా ఎంతో మందికి రక్తంలో ప్లేట్‌లెట్స్ శాతం పడిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్ధితి నానాటికి విషమిస్తుండటంతో ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి.

 

డెంగ్యూపై అవగాహన కల్పించడంతో పాటు పేదలకు అవసరమైన మందులను అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కార్పోరేట్ సంస్థ గోద్రేజ్ సైతం డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

దానితో పాటు ప్లేట్ లెట్స్ కావాల్సిన వారికి, ప్లేట్ లెట్స్ డోనర్లకు వారధిగా ఉండేందుకు ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

దీనికి మంచి స్పందన వస్తుండటంతో త్వరలోనే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్‌లకు సైతం దీనిని విస్తరించేందుకు గోద్రేజ్ సన్నాహాలు చేస్తోంది.

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం గోద్రేజ్ హెల్ప్‌లైన్ ద్వారా సాయం పొందిన వారి వీడియోను షర్ చేసింది. డెంగ్యూపై అవగాహన మరియు సహాయం కోసం 7878782020 నెంబర్‌కు సంప్రదించగలరు.

https://m.godrejhit.com/trackthebitedesktop/?pid=63&utm_medium=Asianet_Truestory_article&utm_campaign=

 

 

click me!