అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి.. ఏడాదిలో రెండో సారి ఘటన

Published : Aug 14, 2023, 01:50 PM IST
అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి.. ఏడాదిలో రెండో సారి ఘటన

సారాంశం

ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఢిల్లీలో ఉన్న అధికారిక నివాసంపై మళ్లీ దాడి జరిగింది. ఈ దాడిలో ఇంటి తలుపులకు ఉన్న గ్లాస్ ప్యానల్స్ పగిలిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలోని అశోక రోడ్డులోని హై సెక్యూరిటీ ఏరియాలో ఉన్న ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. తలుపుపై ఉన్న రెండు గ్లాస్ ప్యానల్స్ పగిలిపోయాయి. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లోని కేర్ టేకర్ పగిలిన అద్దాలను గమనించి పోలీసులకు చేశారు.

బీజేపీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులు- కాంగ్రెస్ ఎంపీ రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు

కాగా.. ఈ దాడి జరిగిన సమయంలో ఒవైసీ ఇంట్లో లేరు. ఘటనా స్థలంలో రాళ్లు గానీ, అద్దాలు పగులగొట్టే ఇతర వస్తువులు గానీ తమకు లభించలేదని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ‘అద్దాలు పగులగొట్టేందుకు ఉపయోగించిన రాళ్లు మాకు దొరకలేదు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’’ అని పోలీసులు చెప్పిన్టటు ‘హిందుస్థాన్ టైమ్స్’పేర్కొంది. 

మద్యానికి డబ్బులిచ్చి.. చికెన్ కర్రీ వండి భర్తను ప్రియుడి దగ్గరికి పంపిన భార్య.. తరువాత ఏమైందంటే ?

నాలుగుసార్లు హైదరాబాద్ నుంచి ఎంపీగా లోకసభకు ఎన్నికైన ఒవైసీకి ఢిల్లీలో ఉన్న అధికారిక నివాసంపై దాడి జరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఫిబ్రవరి 19వ తేదీన కూడా పలువురు దుండగులు ప్రవేశ ద్వారం వద్ద రాళ్లు విసిరి నేమ్ ప్లేట్ ను ధ్వంసం చేశారు. 2014 తర్వాత తన నివాసంపై దాడి జరగడం ఇది నాలుగోసారి అని ఓవైసీ ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !