Teen Suicide అయ్యో.. ఎంత ఘోరం? సెల్ ఫోన్ ప్రాణం తీసిందిగా!

Published : Mar 17, 2025, 11:21 AM IST
Teen Suicide అయ్యో.. ఎంత ఘోరం? సెల్ ఫోన్ ప్రాణం తీసిందిగా!

సారాంశం

స్మార్ట్ ఫోన్ వాడకం నిత్య జీవితంలో భాగమైంది ఇప్పుడు. అయితే కొందరు యువత వీటిని అతిగా వాడుతూ ఆ గ్యాడ్జెట్లకు బానిసల్లా మారుతున్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని భదోహి జిల్లాలో అమ్మాయిని ఫోన్ వాడొద్దని అమ్మ చెప్పింది. దాంతో కోపం వచ్చి అమ్మాయి సూసైడ్ చేసుకుంది. చౌరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమవా ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అర్చన పటేల్ ఉరికి వేలాడుతుండగా వాళ్ల తాతయ్య చూసి, కేకలు వేస్తూ అందరికీ చెప్పాడు. ఇంట్లో వాళ్ళు తలుపులు పగలగొట్టి అమ్మాయిని కిందకి దించేసరికి అప్పటికే చనిపోయింది. పోలీసులు బాడీని పోస్ట్ మార్టంకి పంపించి, కేసుని విచారిస్తున్నారు. పోలీసులు చెప్పిన ప్రకారం అర్చన వాళ్ళ నాన్న జై కుమార్ పటేల్ గుజరాత్ లోని సూరత్ లో పని చేస్తారు. ఆయన భార్య, పిల్లలు వాళ్ళ తాతయ్యతో ఊర్లో ఉంటారు. అర్చన ఇంటర్ పరీక్షలు రాసింది, మార్చి 12న పరీక్షలు అయిపోయాయి. శనివారం రాత్రి అర్చనని వాళ్ళ అమ్మ ఫోన్ ఎక్కువ వాడుతున్నావని తిట్టింది. అందుకే అర్చన అలా చేసింది. ముందు తల్లి మందలించినప్పడు పరీక్షలు అయిపోయాయి కదా ఫోన్ వాడుతున్నానని చెప్పింది. అయినా ఆమె తిట్టడంతో అర్చన తన గదిలోకి వెళ్ళిపోయింది. చాలాసేపటి వరకు అర్చన కిందకి రాకపోవడంతో వాళ్ళ తాతయ్య చూడడానికి వెళ్ళాడు. అక్కడ అర్చన ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు, బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు.

PREV
click me!

Recommended Stories

Slowest Train: కదిలే స్వర్గం ఊటీ టాయ్ ట్రైన్.. సైకిల్ వేగంతో వెళ్లే ఈ రైలు ప్రయాణానికి ఎందుకంత క్రేజ్?
అజిత్ ని పరామర్శించిన సీఎం విజయ్, త్రిష | Ajith Kumar Mother Demise | Asianet News Telugu