జాదవ్‌పూర్ యూనివర్శిటీలో టీనేజర్ బట్టలు విప్పించి.. గదులన్నీ తిప్పుతూ, హోమోసెక్సువల్ అంటూ ర్యాగింగ్...

Published : Aug 24, 2023, 04:16 PM IST
జాదవ్‌పూర్ యూనివర్శిటీలో టీనేజర్ బట్టలు విప్పించి.. గదులన్నీ తిప్పుతూ, హోమోసెక్సువల్ అంటూ ర్యాగింగ్...

సారాంశం

మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ర్యాగింగ్ కు బలయ్యాడు. అతడిని బట్టలు విప్పించి.. గదులన్నీ తిప్పుతూ, హోమోసెక్సువల్ అంటూ హేళన చేస్తూ ర్యాగింగ్ చేశారని తేలింది. 

కోల్‌కతా : ర్యాగింగ్‌పై చర్చకు దారితీసిన జాదవ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థిపై క్యాంపస్‌లోని హాస్టల్‌లో వివస్త్రను చేశారని పోలీసుల విచారణలో తేలింది. మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆగష్టు 9న యూనివర్సిటీ మెయిన్ హాస్టల్ రెండో అంతస్తు నుండి పడి చనిపోయాడు. హాస్టల్‌లో అతను ర్యాగింగ్, లైంగిక వేధింపులకు గురయ్యాడని అతని కుటుంబం ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

హాస్టల్‌లోని బోర్డర్‌లను, సిబ్బందిని విచారించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ర్యాగింగ్ లో భాగంగా యువకుడిని నగ్నంగా ఊరేగించినట్లు వారు తెలిపారు. అతను గంటకు పైగా ర్యాగ్‌కు గురయ్యాడు. బెదిరింపు నుండి తప్పించుకోవడానికి అతను ఒక గది నుండి మరొక గదికి పరిగెత్తాడని దర్యాప్తులో తేలింది. ర్యాగింగ్ ఎపిసోడ్ సమయంలో విద్యార్థి స్వలింగ సంపర్కుడు అంటూ తిట్లు కూడా ఎదుర్కొన్నాడని అక్కడివారు తెలిపారు.

చంద్రయాన్ 3 : చందమామ ఎవరిది? వనరులకు హక్కుదారులెవరు? అంతర్జాతీయ చట్టాలేం చెబుతున్నాయి?

ఇప్పటివరకు అరెస్టయిన 13మంది నిందితుల్లో కనీసం 12 మందికి వ్యతిరేకంగా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. లైంగిక నేరాల నుంచి పిల్లలను కఠినంగా రక్షించే చట్టాన్ని అమలు చేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన విషాదం క్యాంపస్‌లో ర్యాగింగ్‌పై చర్చను రేకెత్తించింది. ఇప్పుడున్న నిబంధనలు ఈ ర్యాగింగ్ ను ఆపడానికి సరిపోతాయా అనే చర్చ తెరమీదికి వచ్చింది. 

ఈ ఘటన రాజకీయంగా కూడా కలకలం రేపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ ప్రతిస్పందిస్తూ.. దీనికి గవర్నర్ సివి ఆనంద బోస్‌ను నిందించింది. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వాటికి "100 శాతం బాధ్యత అతనిదే" అని పేర్కొంది.

గవర్నర్ యూనివర్సిటీకి ఛాన్సలర్, అక్కడ ఉన్నత పదవులకు నియామకాలు చేసే అధికారం ఆయనకే ఉంటుంది. ఈరోజు ఆయన రాజ్‌భవన్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును సమీక్షించారు. అంతకుముందు, విద్యా మంత్రి బ్రత్యా బసు "100 శాతం బాధ్యత" వ్యాఖ్యపై గవర్నర్ స్పందిస్తూ, "నేను బాధ్యతాయుతమైన గవర్నర్‌ని. ఎవరైనా దానిని గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను" అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu