M K Stalin: అస్వ‌స్థ‌తతో ఆసుప‌త్రిలో చేరిన త‌మిళ‌నాడు సీఎం.. వైద్యులు ఏమ‌న్నారంటే

Published : Jul 24, 2025, 02:56 PM IST
Tamil Nadu Chief Minister MK Stalin (File Photo/ANI)

సారాంశం

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న‌ను వెంట‌నే చెన్నైలోని అపోలో ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుద‌ల చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. 

స్వ‌ల్ప అస్వ‌స్థ‌తతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలోని గ్రీమ్స్ రోడ్ అపోలో ఆసుపత్రిలో చేరారు. హృద‌య స్పంద‌న‌లో తేడాలు గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం స్టాలిన్ ఆరోగ్యం బాగుందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటార‌ని వైద్యులు తెలిపారు.

జూలై 21న ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో స్టాలిన్‌కు తల తిరిగిన‌ట్లైంది. వెంటనే ఆయనను పరీక్షల కోసం అపోలో ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు రోజుల తర్వాత స్టాలిన్ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్య బులెటిన్ విడుదల చేసింది.

వైద్య బులెటిన్‌లో, తల తిరుగుడు కారణం కనుగొనడానికి పలు పరీక్షలు నిర్వహించామని, హృద‌య‌స్పంద‌న‌లో తేడాలు ఉండటమే కారణమని తెలిసిందని పేర్కొన్నారు. గుండె సంబంధిత వైద్యులు డా. జి. చెంకుట్టువేలు నేతృత్వంలోని బృందం సలహా మేరకు స్టాలిన్‌ ఈరోజు ఉదయం అపోలోలో చేశారు. బుధవారం చేసిన యాంజియోగ్రామ్ నార్మ‌ల్‌గా ఉంద‌ని ప్రస్తుతం స్టాలిన్ ఆరోగ్యం బాగుందని తెలిపారు. మరో రెండు రోజుల్లో సాధారణ పనులను తిరిగి ప్రారంభిస్తారని వైద్యులు వెల్లడించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే