సోనాలి ఫోగట్ మృతి కేసు: బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ తన చివరి క్షణాలు గడిపిన కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్, ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను ఐదు రోజుల పోలీసు కస్టడీకు అప్పగించింది గోవా కోర్టు. అలాగే న్యూన్స్ బెయిల్ దరఖాస్తును కూడా తిరస్కరించింది.
సోనాలి ఫోగట్ మృతి కేసు: బీజేపీ నాయకురాలు, నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోనాలి ఫోగట్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. స్పైక్డ్ వాటర్ తాగమని బలవంతం చేశారని గోవా పోలీసులు ఆమె బస చేసిన రెస్టారెంట్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సోనాలి ఫోగట్ తన చివరి క్షణాలు గడిపిన కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్ను గోవా కోర్టు ఆదివారం రిమాండ్ కు అప్పగించింది. అలాగే, మరో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. రెస్టారెంట్ యజమాని న్యూన్స్ బెయిల్ దరఖాస్తును కూడా న్యాయస్థానం తిరస్కరించింది.
కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం: గోవా సీఎం
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదివారం నాడు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ టెలిఫోన్ సంభాషణలో సోనాలి ఫోగట్ మరణంపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించడానికి సుముఖత వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ, గోవా పోలీసులు ఇప్పటివరకు సమగ్ర దర్యాప్తు చేశారని, ఖట్టర్ తన సంభాషణలో ఫోగట్ కుటుంబ సభ్యుల డిమాండ్ను సీబీఐ విచారణకు ప్రస్తావించారని సావంత్ అన్నారు. “అవసరమైతే, అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత మేము కేసును సీబీఐకి అప్పగిస్తాము. అయితే గోవా పోలీసులు ఇప్పటి వరకు క్షుణ్ణంగా విచారణ చేశారు' అని సావంత్ తెలిపారు.
సోనాలి ఫోగట్ మృతి కేసు వివరాలు..