సెమికాన్ 2024: సెమీకండక్టర్ తయారీ హబ్ గా భారత్.. ఇన్వెస్టర్ల భరోసా

By Mahesh RajamoniFirst Published Sep 12, 2024, 1:54 PM IST
Highlights

SEMICON 2024:  ప్రపంచవ్యాప్తంగా సెమీ కండ‌క్ట‌ర్స్ ప‌రిశ్ర‌మ డౌన్ అయినప్పుడు ప్రపంచం భారత్ పై పందెం వేయవచ్చని ప్రధాని అన్నారు. భారత్ లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఇదే సరైన సమయమంటూ ప్రపంచ చిప్ తయారీ పరిశ్రమలో భారత్ ఎదుగుతున్న తీరును ప్ర‌ధాని మోడీ హైలెట్ చేశారు. సెమీ కండక్టర్ పెట్టుబడులను ఆకర్షించడంలో యూపీ ప్రభుత్వ చర్యలను ప్రశంసించారు. 

SEMICON 2024: : గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరిగిన సెమికాన్ ఇండియా 2024 ప్రారంభోత్సవంలో ప్రాధాని మోడీ మాట్లాడుతూ.. భారత్ లో సెమీ కండక్టర్ల తయారీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని అన్నారు. భారత్ సెమీ కండక్టర్ల తయారీ హాబ్ గా విస్తరిస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,  ప్రపంచ దేశాల నాయకులు, పెట్టుబడిదారులతో ప్రధాని సమావేశమయ్యారు. సీఎం యోగీ మాట్లాడూతూ.. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం సెమీకండక్టర్లకు ప్రపంచ కేంద్రంగా అవతరించే సామర్థ్యాన్ని కలిగి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సెమీకండక్టర్ పెట్టుబడులకు ఉత్తరప్రదేశ్ అనువైన గమ్యస్థానంగా ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లో సురక్షితమైన, అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందించడానికి రాష్ట్రం కట్టుబడి ఉందనే విషయాలను కూడా ఇన్వెస్టర్లు ప్రస్తావించారు.

Latest Videos

దక్షిణ కొరియాకు చెందిన హన్యాంగ్ ఇంజనీరింగ్‌కు చెందిన డేహూన్ లీ మాట్లాడుతూ, “సెమీకండక్టర్లకు భారతదేశం విస్తారమైన అవకాశాలను అందిస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రపంచం చూసింది, అధునాతన సాంకేతికతను వేగంగా అవలంబించడంతో, ఇక్కడ సెమీకండక్టర్ల పరిధి నిరంతరం విస్తరిస్తోంది” అని అన్నారు.

సింగపూర్‌కు చెందిన కెన్ ఉకావా మాట్లాడుతూ, “భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు చిన్నగా ఉండవచ్చు, కానీ ప్రధాని మోడీ దార్శనికతతో, ఇది గణనీయంగా వృద్ధి చెందే దిశగా సాగుతోంది. భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఆకర్షించింది, ఇది నిజంగా ఆకట్టుకునే విషయం” అని అన్నారు.

జర్మన్ కంపెనీ విస్కో టెక్ ప్రతినిధి రాహుల్ మాట్లాడుతూ, సీఎం యోగి నాయకత్వంలో తీసుకువచ్చిన పెట్టుబడుల  సంస్కరణలు ఉత్తరప్రదేశ్‌ను విదేశీ పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చాయని అన్నారు. అందుకే తమ కంపెనీ ఏటా రాష్ట్రంలో తన పెట్టుబడులను పెంచుకుంటోందని చెప్పారు.

 పైన్‌టిక్స్‌కు చెందిన అలంకార్ ధోబ్లే మాట్లాడుతూ.. “సదుపాయాలను అందించడంలో ప్రభుత్వ చురుకైన విధానం కారణంగా యూపీలో పెట్టుబడి పెట్టడం చాలా అనుకూలంగా మారింది. ఇన్వెస్టర్లకు సహకారాన్ని అందించాలనే సీఎం యోగి హామీ పెట్టుబడిదారులలో ఉత్సాహాన్ని నింపింది, ఇది రాష్ట్రంలో పెట్టుబడులను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది” అని అన్నారు.

సెమీకండక్టర్ తయారీకి పెట్టుబడి బూస్ట్

SEMICON ఇండియా 2024లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరఫరా గొలుసు స్థితిస్థాపకత పాత్రను నొక్కిచెప్పారు. భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ సామర్థ్యాలను ప్ర‌స్తావించారు. సెమీకండక్టర్ల తయారీకి సంబంధించి భారతదేశం ఇప్పటికే ₹ 1.5 లక్షల కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉందని మోడీ హైలైట్ చేశారు. వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు పైప్‌లైన్‌లో అనేక కొత్త ప్రాజెక్టులతో, భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా ఉంచడానికి ఇది ఒక ప్రధాన అడుగని పేర్కొన్నారు.

click me!