స్కూటీని ఢీకొట్టిన కారు.. యువతి శరీరాన్ని కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. న్యూ ఇయర్ రోజే ఘటన

Published : Jan 01, 2023, 08:31 PM ISTUpdated : Jan 02, 2023, 01:43 PM IST
స్కూటీని ఢీకొట్టిన కారు.. యువతి శరీరాన్ని కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. న్యూ ఇయర్ రోజే ఘటన

సారాంశం

న్యూ ఇయర్ రోజు ఉదయమే ఢిల్లీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. స్కూటీ నడుపుతున్న యువతిని కొన్ని కిలోమీటర్ల మేరకు ఆ కారు అలాగే ఈడ్చుళ్లింది. అది చూసిన కొందరు పోలీసులకు రిపోర్ట్ చేయగా.. నిందితులను పట్టుకున్నారు. ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఈ ఘటన జరిగింది.  

న్యూఢిల్లీ: న్యూ ఇయర్ రోజు తెల్లవారుజామునే ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. స్కూటీ నడుపుతున్న యువతి కారు కింది భాగంలో చిక్కుకుపోయింది. ఆ కారు అలాగే కొన్ని కిలోమీటర్ల మేర ఆమె బాడీని ఈడ్చుళ్లింది. ఆ యువతి మరణించింది. ఢిల్లీలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఆ మారుతీ సుజుకీ బాలెనో కారులో నుంచి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఏజెంట్, డ్రైవర్, రేషన్ షాప్ ఓనర్‌ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఈ రోజు ఉదయం ఘటన జరిగింది.

తెల్లవారుజామున 3.24 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ కాల్ వచ్చింది. మనిషి శరీరాన్ని ఓ కారు లాక్కెళ్లుతూ ఉన్నదని తెలిపారు. మరో కాల్ 4.11 గంటలకు వచ్చింది. రోడ్డుపై ఓ మహిళ బాడీ పడి ఉన్నదని ఈసారి కాల్ చేసిన వ్యక్త చెప్పారు. పికెట్‌ల దగ్గర మోహరించిన పోలీసులను వెంటనే అలర్ట్ చేశారు. ఆ వాహనం కోసం సెర్చ్ చేశారు.

Also Read: బోయినపల్లి చౌరస్తా‌లో ప్రమాదం.. రోడ్డుదాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ద దంపతుల మృతి..

కారు నెంబర్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. తమ కారు ఓ స్కూటీని ఢీ కొట్టిందని చెప్పిన నిందితులు.. ఆమెను తమ కారు కొన్ని కిలోమీటర్ల మేరకు ఈడ్చుకు వచ్చిందనే విషయం తమకు తెలియదని చెప్పారని పేర్కొన్నారు.

కాగా, ఈ ఘటన పై ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్స్ చీఫ్ స్వాతి మాలివాల్ రియాక్ట్ అయ్యారు. ఆ కారులో ఉన్నవారు మద్యం సేవించి ఉన్నారని తెలిసిందని వివరించారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఢిల్లీ పోలీసులకు సమన్లు పంపిస్తా అని తెలిపారు. మొత్తం సత్యం అంతా బయటకు రావాల్సిందే అని పేర్కొన్నారు. ఆ యువతిపై లైంగికదాడి జరిగిందని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. పోలీసులు ఆ ఆరోపణలను ఖండించారు.

మరణించిన యువతి అమన్ విహార్ నివాసి. తండ్రి మరణించిన కుటుంబంలో ఆమెనే పెద్ద కూతురు. తల్లితోపాటు నలుగురు అక్కా చెళ్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు కలిసి జీవిస్తున్నారు. అందులో పెద్ద కూతురే తాజా ఘటనలో మరణించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sia Goyal Case: కేతన్ అగర్వాల్ హత్య జరిగిన స్పాట్ ఇదే సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి | Asianet Telugu
చెన్నైలో చిన్నారులకు పోలియో వేసిన సీఎం విజయ్ | CM Vijay Launches National Pulse Polio