అత్యాచారం, దోపిడీ కేసు : ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన మహారాష్ట్ర కోర్టు...

Published : Apr 25, 2023, 04:07 PM IST
అత్యాచారం, దోపిడీ కేసు : ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన మహారాష్ట్ర కోర్టు...

సారాంశం

ప్రాసిక్యూషన్ ప్రకారం, నేరం 2010 - 2014 మధ్య జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒకరు బాధితురాలికి ఆర్థికంగా సహాయం చేసి, ఆమెను వివాహం చేసుకోవడానికి కూడా ప్రతిపాదించారు.

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని థానే జిల్లాలో 40 ఏళ్ల మహిళపై పలుమార్లు అత్యాచారం చేసి డబ్బు వసూలు చేసిన కేసులో ఒక మహిళతో సహా ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.అదనపు సెషన్స్ జడ్జి అమిత్ ఎం షెటే ఏప్రిల్ 19న భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత నిబంధనల ప్రకారం అభియోగాల నుండి నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు.

వితంతువు అయిన బాధితురాలు తన పిల్లలతో కాషిమీరాలో నివసిస్తోందని, నిందితులు కూడా ఆమె పొరుగునే ఉండేవారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజయ్ బి మోరే కోర్టుకు తెలిపారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, నేరం 2010 - 2014 మధ్య జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒకరు బాధితురాలికి ఆర్థికంగా సహాయం చేసి, ఆమెను వివాహం చేసుకోవడానికి కూడా ప్రతిపాదించారు. ఆ తర్వాత ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

మంచిర్యాల యువకుడి హత్య : యువతి వీడియోలు భర్తకు పంపడంతో ఆత్మహత్య.. ఆ కక్షతోనే బండరాయితో మోది..

బాధితురాలైన ఆ మహిళ న్యాయం చేయాలంటూ నిందితురాలైన మరో మహిళను సంప్రదించింది. ఆమె బాధితురాలికి సహాయం చేస్తానని వాగ్దానం చేసి రూ. 30,000 డిమాండ్ చేసింది. బాధితురాలు తన నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఆమెకు ఇచ్చింది. బాధితురాలు నిందితురాలైన మహిళతో సమావేశమైన సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్ తెలిపింది.

సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత, చాలా కాలంగా లైంగిక వేధింపులకు గురవుతున్నప్పటికీ బాధితురాలు ఎటువంటి ప్రతిఘటనను ప్రదర్శించకపోవడంపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది.అలా అయితే, ఆ సంబంధం ఆమెకు కూడా ఇష్టమే అయి ఉండాలని అనిపిస్తుందని తెలిపింది.

బాధితురాలు తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ. 30,000 సేకరించగలిగినప్పుడు, నిందితులలో ఒకరి నుండి ఆర్థిక సహాయాన్ని ఎందుకు స్వీకరించారు.. అనే ప్రశ్నలను కూడా కోర్టు లేవనెత్తింది.

ప్రాసిక్యూషన్ వెర్షన్, ఆరోపణలకు బదులు, బాధితురాలి కల్పిత లేదా ఊహాజనిత కథ తప్ప మరొకటి కాదని, నిందితులపై మోపబడిన అభియోగాలకు మద్దతుగా రికార్డులో ఎటువంటి మెటీరియల్ లేదని న్యాయమూర్తి అన్నారు. దీంతో ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ముగ్గురిని న్యాయస్థానం నిర్ధోషులుగా తేల్చింది. 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu