పహల్గాం దాడి: యుద్ధం వస్తుందా? రాజ్‌నాథ్ సింగ్ మాటల్లో అదే అర్థం

Published : May 04, 2025, 07:56 PM IST
పహల్గాం దాడి: యుద్ధం వస్తుందా? రాజ్‌నాథ్ సింగ్ మాటల్లో అదే అర్థం

సారాంశం

పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టిగా స్పందించారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక బలాన్ని ఆయన ప్రశంసించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం నాడు గట్టిగా స్పందించారు. ఈ దాడిలో 26 మంది మరణించారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

 

 

న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన సనాతన సంస్కృతి జాగరణ మహోత్సవంలో మాట్లాడుతూ, పహల్గాం దాడిలో ప్రాణనష్టంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజ్ నాథ్ సింగ్, దేశానికి హాని చేసేవారికి “తగిన గుణపాఠం చెబుతామని ప్రతిజ్ఞ చేశారు.

“రక్షణ మంత్రిగా, భారతదేశ సరిహద్దులను రక్షించడం, మన ప్రజల భద్రతను కాపాడటం నా విధి” అని ఆయన అన్నారు. “మన దేశానికి హాని చేయడానికి ప్రయత్నించే వారికి గట్టిగా బదులిస్తామని నేను హామీ ఇస్తున్నాను.”

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ, “మన ప్రధానమంత్రి ఎంత కష్టపడి పనిచేస్తారో, ఎంత దృఢ సంకల్పం కలిగిన వారో మీ అందరికీ తెలుసు. ఆయన నాయకత్వంలో, మీరు కోరుకున్న విధంగానే భారతదేశం చర్య తీసుకుంటుంది” అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

సైనికులు యుద్ధభూమిలో దేశాన్ని రక్షించినట్లే, సాధువులు, ఋషులు ఆధ్యాత్మికత ద్వారా దేశ విలువలను కాపాడుతారని ఆయన అన్నారు.

“ఒకవైపు, ఃధైర్యవంతులైన సైనికులు యుద్ధభూమిలో శత్రువులతో పోరాడుతారు. మరోవైపు, మన సాధువులు మన సమాజ ఆధ్యాత్మిక బలానికి పోరాడుతారు” అని ఆయన అన్నారు.

ఈ రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగవచ్చనే సంకేతాలు వెల్లడవుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu