నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా: కేరళ బీజేపీ అధ్యక్షులు రాజీవ్ చంద్రశేఖర్

Published : Sep 01, 2025, 08:50 PM IST
Rajeev Chandrasekhar honor fathers promise by serving Kerala

సారాంశం

Rajeev Chandrasekhar: “నాన్న ఆఖరి కోరిక నెరవేరుస్తున్నాను. కేరళ అభివృద్ధి కోసం పనిచేయాలని, అక్కడికి వెళ్లాలని నాన్న నాతో చెప్పారు. అది పెద్ద బాధ్యత అని, కష్టపడి పనిచేయాలని, కేరళలో మార్పు తీసుకురావాలని ఆయన కోరారు” అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

DID YOU KNOW ?
ఎంకే చంద్రశేఖర్
ఎంకే చంద్రశేఖర్ కేరళ త్రిస్సూర్ మంగటిల్ కుటుంబానికి చెందినవారు. ఆయన భార్య ఆనందవల్లి. కుమారుడు రాజీవ్ చంద్రశేఖర్, కుమార్తె డా. దయా మీనన్.

Rajeev Chandrasekhar: కేరళ కోసం పనిచేయడం తన తండ్రికిచ్చిన మాటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. తన తండ్రి ఎంకే చంద్రశేఖర్ మరణం తర్వాత తిరువనంతపురంలో జరిగిన తొలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకాలు పంచుకున్నారు. 

"మూడు రోజుల క్రితం నాన్న చనిపోయారు. మార్చి 26న నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు. ఆ మాటే నన్ను నేడు ఇక్కడికి తీసుకొచ్చింది. 'రాజీవ్, మన రాష్ట్రం బాగుచేయాలి. అందుకోసం నువ్వు అక్కడికి వెళ్లాలి. అది పెద్ద బాధ్యత. చాలా కష్టపడాలి. కొంతకాలంగా మన రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు. అక్కడ మార్పు తీసుకురావాలి' అని ఆయన అన్నారు. ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనకు నేను మాట ఇచ్చాను. ఆ మాటే నన్ను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చింది" అని ముడాక్కల్ పంచాయతీలో ఆశా వర్కర్లు, ఉపాధి హామీ కూలీలకు ఓనం కిట్లు పంపిణీ చేస్తూ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

మలయాళీలకు ఓనం చాలా ముఖ్యమైన పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేసుకునే రోజని ఆయన అన్నారు. “బీజేపీకి సంబంధించి పార్టీ సిద్ధాంతాలు, పూర్వ నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ మనకు నేర్పింది ఒక్కటే.. ఇది ప్రజలకు సేవ చేసే అవకాశం.. అన్నివేళలా అందరితోనూ, అందరికీ ఉపయోగపడేలా పనిచేసే పార్టీ బీజేపీ. ఓనం సందర్భంగా ఎక్కువ రాజకీయాలు మాట్లాడాలని అనుకోవడం లేదు. ఓనం జరుపుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు, వాళ్ల అధికార రాజకీయాల వల్ల ఇప్పుడు పాలక్కాడ్ జరుగుతున్న విషయాలు, శబరిమల పేరుతో చేయబోతున్న ప్రయత్నాలు అన్నీ స్వార్థ ప్రయోజనాలతో, ప్రజలను మోసం చేసే రాజకీయాలే. బీజేపీ రాజకీయాలు వీటికి భిన్నమైనవని” రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

ప్రజల కోసం 365 రోజులు, 24 గంటలూ బీజేపీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. “అందరితోనూ ఉంటాము. ముడాక్కల్ పంచాయతీలో ఈ కార్యక్రమం జరగడం చాలా ప్రత్యేకం. అత్యధిక ఓట్లు వచ్చిన పంచాయతీ ఇది. ఇక్కడ అభివృద్ధి చెందిన ముడాక్కల్ పంచాయతీని మేము నిర్మిస్తాం. బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ సమూల మార్పు వస్తుంది. ప్రజలు ఎన్నుకున్న సభ్యులు మీ కోసం పనిచేస్తారని నేను హామీ ఇస్తున్నాను. అదే బీజేపీ రాజకీయం. బీజేపీ ప్రజలను విడదీయదు, మోసం చేయదు, ప్రజల కోసం పనిచేస్తుంది. ఓనం జరుపుకునేటప్పుడు సహాయం అవసరమైన వారికి సహాయం చేయడానికి కూడా ప్రయత్నించాలి. వ్యక్తిగతంగా చేయలేకపోతే, బీజేపీ సంస్థాగతంగా ఆ సహాయం అందిస్తుంది” అని రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu