ఒడిషా రైలు ప్రమాదం.. రాజీనామా చేయను : విపక్షాలకు కౌంటరిచ్చిన అశ్విని వైష్ణవ్

Siva Kodati |  
Published : Jun 03, 2023, 08:10 PM IST
ఒడిషా రైలు ప్రమాదం.. రాజీనామా చేయను : విపక్షాలకు కౌంటరిచ్చిన అశ్విని వైష్ణవ్

సారాంశం

ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో తన రాజీనామాకు పట్టుబట్టిన విపక్షాలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటరిచ్చారు. రాజకీయాలకు ఇది సమయం కాదని.. తాను రాజీనామా చేయనని ఆయన స్పష్టం చేశారు. 

ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా దేశంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. తాను రాజీనామా చేయనని.. రాజకీయాలకు ఇది సమయం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 261 మంది ప్రాణాలు కోల్పోయారని వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలపైనే తాము దృష్టి కేంద్రీకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

రైల్వే మంత్రి రాజీనామాకు టీఎంసీ డిమాండ్:

ఒడిశాలో జరిగిన ఘోర ట్రిపుల్ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) డిమాండ్ చేసింది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి రైళ్లలో యాంటీ కొలిషన్ పరికరాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి కేంద్రం స్పై సాఫ్ట్వేర్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వందేభారత్ రైళ్లు, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ల గురించి గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ మద్దతును పెంచుకుంటోందని విమ‌ర్శించారు. ఇదే స‌మ‌యంలో భద్రతా చర్యలను విస్మరిస్తోందని ఆరోపించారు.

ALso Read: Odisha Train Accident: ఆ తప్పిదమే ప్రమాదానికి కారణమా?: నిపుణుల ప్రాథమిక నివేదిక ఏం చెబుతుందంటే..

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, లాక్డౌన్లు, వ్యవసాయ చట్టాలు, తగినంత రైల్వే భద్రతా చర్యలు లేక కేంద్రం ఉదాసీనత, వారి చర్యల వల్ల నష్టపోయేది నిరుపేదలు, అణగారిన ప్రజలేనని మమతా బెనర్జీ అన్నారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాననీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాననీ, మనస్సాక్షి ఉంటే రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, అభిషేక్ బెనర్జీకి మద్దతుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే మాట్లాడుతూ,'బాధితులకు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ ప్రార్థనలు. ... సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా 3 రైళ్లు ప్రమాదానికి గురయ్యాయంటే నమ్మశక్యం కాని విధంగా ఉంది. అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది' అని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు.

భద్రతకు ప్రాధాన్యమివ్వాలి: కాంగ్రెస్

రైల్వే నెట్ వ‌ర్క్ పనితీరులో భద్రతకు ఎల్లప్పుడూ ఎందుకు ప్రాధాన్యమివ్వాలో ఒడిశాలో జరిగిన భయంకరమైన రైలు ప్రమాదం బలపరుస్తుందనీ, అనేక న్యాయమైన ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ శనివారం పేర్కొంది. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నిజంగా భయానకమనీ, ఇది చాలా బాధాకరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. "రైలు నెట్ వ‌ర్క్ పనితీరులో భద్రతకు ఎల్లప్పుడూ ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో ఇది బలపరుస్తుంది. అనేక న్యాయమైన ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉంది, కానీ అవి రేపటి వరకు వేచి ఉండాలి" అని రమేష్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు అవసరమైన అన్ని విధాల‌ మద్దతును అందించాలని పార్టీ కార్యకర్తలను, నాయకులను కోరారు.

రైల్వేల భద్రతా వ్యవస్థపై వామ‌ప‌క్షాల ప్ర‌శ్న‌లు.. 

సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య భారతీయ రైల్వేలో సిగ్నలింగ్, భద్రతా వ్యవస్థను ప్రశ్నించారు. ఇటువంటి విషాదాలు కొత్తగా సాధారణమవుతాయా అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు. "లగ్జరీ రైళ్లపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారించింది. రైళ్లను, సామాన్యుల పట్టాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని ఫలితమే ఒరిస్సా మరణాలు. రైల్వే మంత్రి రాజీనామా చేయాలి' అని విశ్వం ట్వీట్ చేశారు.

నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదం: శివసేన

రైల్వే మంత్రి రాజీనామా చేయాలని శివసేన (ఉద్ధవ్ థాక్రే) నేత సంజయ్ రౌత్ అన్నారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యమనీ, రైల్వే మంత్రి ఒడిశాకు చెందిన వ్యక్తి అనీ, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu