
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ మెదటివారంలో ఈ పర్యటన ప్రారంభం కాగా.. దాదాపు వారం రోజులపాటు ఈ పర్యటన సాగనున్నది. ఈ సందర్భంగా ఆయన యూరోపియన్ యూనియన్ (EU) చట్టసభ సభ్యులతో పాటు పారిస్లోని యూనివర్సిటీలో విద్యార్థులు, భారతీయ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారని వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీ యూరప్ షెడ్యూల్
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జీ20 సదస్సు జరగనుంది. గ్రూప్కు ప్రస్తుత చైర్గా భారత్ జి20 సమ్మిట్ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 30 మందికి పైగా జాతీయ అధ్యక్షులు పాల్గొంటారు. దేశాధినేతలతో పాటు, EU ఆహ్వానించబడిన అతిథి దేశాల నుండి ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొంటారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీ యూరప్ లో పర్యటించనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే.. రాహుల్ గాంధీ గత విదేశీ పర్యటనలో భారత్ లో కీలక పరిణాలు తీవ్ర వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన విషయం తెలిసిందే.