రాహుల్ గాంధీ ప్రశ్నలకు భయపడుతున్నారు.. అందుకే డ్రామాలు సృష్టిస్తున్నారు - కాంగ్రెస్

Published : Mar 21, 2023, 03:05 PM IST
రాహుల్ గాంధీ ప్రశ్నలకు భయపడుతున్నారు.. అందుకే డ్రామాలు సృష్టిస్తున్నారు - కాంగ్రెస్

సారాంశం

అదానీతో ఉన్న సంబంధాలపై రాహుల్ గాంధీ ప్రధానిని ప్రశ్నలు వేస్తారని ప్రభుత్వం భయపడుతోందని, అందుకే డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక నుంచి తలెత్తే ప్రశ్నలను తప్పించుకునేందుకే లండన్ లో రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ రచ్చ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీవి డ్రామాలు అని అభివర్ణించింది. ప్రభుత్వాన్ని విమర్శించడం దేశాన్ని విమర్శించడం రెండూ సమామానం కావని  కాంగ్రెస్ పార్టీ మీడియా, పబ్లిసిటీ విభాగం ఇంచార్జ్ పవన్ ఖేరా పార్టీ  అన్నారు. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.

మీకు 80,000 మంది పోలీసులు ఉన్నారు.. అమృతపాల్ సింగ్ ఎలా పారిపోయాడు?.. పంజాబ్‌ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న..

‘‘చర్చ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచదు. దానికి బదులు బలపరుస్తుంది. ప్రతిపక్షాల ప్రశ్నల నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున ప్రభుత్వం ఈ డ్రామా చేస్తోంది” అని అదానీ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల నిరంతర నిరసన మధ్య ఖేరా అన్నారు. ‘‘అదానీతో ఉన్న సంబంధాల గురించి రాహుల్ గాంధీ మరోసారి ప్రధానిని అడుగుతారేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంకా జేపీసీ విచారణ జరగలేదు. అందుకే ఇంత డ్రామాలు సృష్టిస్తున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.

హిందుత్వపై అభ్యంతరకర ట్వీట్.. కన్నడ నటుడు చేతన్ కుమార్ అరెస్టు.. ఏమని ట్వీట్ చేశాడంటే?

విదేశీ శక్తుల సహాయం కోరి భారత్ లో రాహుల్ గాంధీ ప్రస్తుత భారత రాజకీయ వ్యవస్థ మీర్ జాఫర్ గా మారారని అభివర్ణించిన బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రాకు త్వరలోనే గట్టి సమాధానం లభిస్తుందని ఖేరా అన్నారు. ‘‘త్వరలోనే ఆయనకు గట్టి సమాధానం లభిస్తుంది. సమాధానాలు ఎలా చెప్పాలో కూడా వారి (బీజేపీ) నుంచి నేర్చుకుంటున్నాం. త్వరలోనే ఆయన ప్రకటనపై చర్యలు తీసుకుంటాం’’ అని ఖేరా తెలిపారు.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని లండన్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మంగళవారం దాడిని ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రస్తుత భారత రాజకీయాల మీర్ జాఫర్ అని చెప్పడం అతిశయోక్తి కాదన్నారు. మీర్ జాఫర్ చేసిన పనినే ఆయన చేశారని విమర్శించారు. ‘‘లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ కూడా ఇదే పని చేశారు. విదేశీ శక్తులను భారత్ కు రావాలని ఆహ్వానించారు. షెహజాదా నవాబు కావడానికి ఈస్టిండియా కంపెనీ సహాయం కోరాడు’’ అని పాత్రా ఆరోపించారు.

పంజాబ్ శాంతి విషయంలో రాజీపడబోం - సీఎం భగవంత్ మాన్

సిరాజ్ ఉద్-దౌలా ఆధ్వర్యంలో బెంగాల్ సైన్యంలో కమాండర్ గా పనిచేసిన మీర్ జాఫర్ ఈస్టిండియా కంపెనీ బెంగాల్ మొదటి నవాబు. ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్-దౌలాకు ద్రోహం చేసి భారతదేశంలో బ్రిటిష్ పాలనకు మార్గం సుగమం చేశాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!
Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu