మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో: ప్రారంభమైన పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌

Siva Kodati |  
Published : May 21, 2019, 07:36 AM IST
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో: ప్రారంభమైన పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌

సారాంశం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్-2బీర్1ను బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్షలోకి ప్రవేశపెట్టనుంది. 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్-2బీర్1ను బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్షలోకి ప్రవేశపెట్టనుంది.

ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమయింది. ఇది నిర్విరామంగా 25 గంటల పాటు కొనసాగనుంది. ముందుగా ఈ రాకెట్ ప్రయోగాన్ని బుధవారం ఉదయం 5.27 గంటలకు చేపట్టాలని నిర్ణయించారు.

అయితే ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్ధాలు అడ్డు రానుండటాన్ని ఇస్రో ముందుగా గుర్తించింది. దీంతో మూడు నిమిషాలు ఆలస్యంగా 5.30 గంటలకు చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు షార్‌లో జరుగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu