ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలు బెటర్: బిజెపి ఎమ్మెల్యే

Published : Jun 06, 2018, 10:41 AM IST
ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలు బెటర్: బిజెపి ఎమ్మెల్యే

సారాంశం

బిజెపి శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

న్యూఢిల్లీ: బిజెపి శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలు ఉత్తమమని అన్నారు. లంచాలు అడిగితే అధికారులను తన్ని తగిలేయాలని వ్యాఖ్యానించిన మర్నాడే ఆ వ్యాఖ్య చేశారు. 

"వేశ్యలు ప్రభుత్వాధికారుల కన్నా ఉత్తమం. కనీసం వాళ్లు డబ్బులు తీసుకుని వారి పనులు వారు చేస్తారు, వేదికపై నృత్యం చేస్తారు. కానీ ఈ అధికారులు డబ్బులు తీసుకుని కూడా పని చేయరు. పని అవుతుందనే గ్యారంటీ లేదు" అని అన్నారు.

ఓ బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యాలు చేశారు. అతను పనిచేయడానికి అంగీకరించకపోతే కొట్టి గుణపాఠం నేర్పాలని, అప్పటి కూడా చేయకపోతే బూట్లతో కొట్టాలని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit