ఢిల్లీ కొత్త మంత్రులుగా అతిషి, సౌరభ్ భరద్వాజ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం.. రేపు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్.

Published : Mar 08, 2023, 10:08 AM IST
ఢిల్లీ కొత్త మంత్రులుగా అతిషి, సౌరభ్ భరద్వాజ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం.. రేపు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్.

సారాంశం

ఢిల్లీ కేబినెట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను మంత్రులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరూ గురువారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ మంత్రులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం (మార్చి 7) ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని మంత్రులుగా నియామించాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎల్జీ వీకే సక్సేనాకు ప్రతిపాదనలుగా పంపారు. వీరిద్దరూ గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. వీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

నేనంటే ఇష్టం లేకపోతే నా తల నరికేయండి.. కానీ డీఏ పెంచడం కుదరదు - మమతా బెనర్జీ

2020లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అతిషి కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ సిసోడియా ఎడ్యుకేషన్ టీమ్ లో కీలక సభ్యుడిగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. 2013-14లో 49 రోజుల కేజ్రీవాల్ తొలి ప్రభుత్వంలో రవాణా, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన సౌరభ్ భరద్వాజ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భరద్వాజ్ ఢిల్లీ జలమండలి వైస్ చైర్మన్ హోదాలో యమునా నదిని శుభ్రం చేయడం, ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీటిని తీసుకెళ్లే బాధ్యతను కూడా అప్పగించారు.

వైమానిక దళం చారిత్రాత్మక నిర్ణయం.. యుద్ధ భూమిలో కమాండర్‏గా షాలిజా ధామి

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. గత ఏడాది ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు తర్వాత ఆయన నిర్వహించిన ఏడు శాఖలను సిసోడియాకు బదిలీ చేశారు. అరెస్టు తర్వాత సిసోడియా మంగళవారం తాను నిర్వహిస్తున్న 18 పదవులకు రాజీనామా చేశారు.

కేరళ యూనివర్సిటీ సంచలన నిర్ణయం.. విద్యార్థినీలకు ప్రసూతి సెలవులు

ఇప్పుడు రద్దు చేసిన వివాదాస్పద ఎక్సైజ్ పాలసీని 2021 లో మహమ్మారి మధ్యలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ ఆమోదించింది. ఈ విధానంలో అవినీతి జరిగిందంటూ సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆప్ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో సిసోడియాతో పాటు మరో 15 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులోనే సిసోడియా అరెస్టు అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu