మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రచారం నేపథ్యంలో ప్రాధాన్యత..!!

Published : Jul 03, 2023, 04:39 PM IST
మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రచారం నేపథ్యంలో ప్రాధాన్యత..!!

సారాంశం

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ ప్రాంగణంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది.

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులను కాకుండే.. సహాయ మంత్రులను కూడా ఆహ్వానించారు. ఈ ఏడాది  చివరల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. కేంద్ర కేబినెట్‌లో మార్పులు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్‌లో మార్పులు-చేర్పులు జరిగిన పక్షంలో మిత్రపక్షాలతో పాటు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన నేతలకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పిస్తారనే ప్రచారం సాగుతుంది. 

ఈ కేబినెట్ సమావేశంలో.. పార్లమెంట్ వర్షకాల సమావేశాల గురించి చర్చించే అవకాశం ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్‌తో పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే తన అమెరికా పర్యటన విజయవంతం కావడంపై మోదీ.. ఈ సమావేశంలో తన ఆలోచనలను పంచుకోనున్నారు. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu