PM Modi: తిరువనంతపురంలో ప్రధాని మోడీ

Published : May 01, 2025, 10:21 PM IST
PM Modi: తిరువనంతపురంలో ప్రధాని మోడీ

సారాంశం

PM Modi in Thiruvananthapuram: విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరువనంతపురం చేరుకున్నారు. 

Vizhinjam seaport: కేరళలోని విజింజం పోర్ట్‌ను దేశానికి అంకితం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ త్రివేండ్రం చేరుకున్నారు. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు విమానం దిగిన ప్రధాని రోడ్డు మార్గంలో రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రధాని రాక నేపథ్యంలో రాజధాని నగరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంది. ఈ కలల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం చాలా కాలం నుంచి ఎదరుచూస్తున్నారు.

కేరళ ఎదురుచూపులకు తెరపడే క్షణం వచ్చింది. విజింజం పోర్ట్‌ని దేశానికి అంకితం చేయడానికి ఇక కొన్ని గంటలే సమయం ఉంది.  రాత్రి ఏడున్నర దాటిన తర్వాత త్రివేండ్రం విమానాశ్రయం టెక్నికల్ ఏరియాలో ప్రధాని ఎయిర్ ఇండియా వన్ విమానం దిగింది. రోడ్డు మార్గంలో రాజ్‌భవన్‌కు బయలుదేరిన మోడీ రాత్రి గవర్నర్‌తో కలిసి భోజనం చేస్తారు. శుక్రవారం ఉదయం 10.15కి వైమానిక దళ హెలికాప్టర్‌లో ప్రధాని విజింజం చేరుకుంటారు. ఆ తర్వాత పోర్ట్‌ని పరిశీలిస్తారు. ఆ తర్వాత పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. 12.30కి త్రివేండ్రం నుంచి బయలుదేరుతారు.

పెహల్గాం దాడి నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేల, నీటి మీద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోర్ట్ భద్రతను ఎస్పీజీ బాధ్యతలు స్వీకరించింది. నగరమంతా పోలీసులను మోహరించారు. సముద్రంలో కోస్ట్ గార్డ్, నేవీ భద్రత కల్పిస్తాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి 10,000 మంది హాజరవుతారని అంచనా. తంబానూర్, కిజక్కెకోట నుంచి కేఎస్ఆర్టీసీ విజింజం వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఉదయం 7 నుంచి 9.30 వరకు ముల్లూర్‌లోని పోర్ట్ గేట్ దగ్గర రోడ్డు ద్వారా ప్రజలను అనుమతిస్తారు. ప్రధాన గేట్ ద్వారా ప్రధాని, ముఖ్యమంత్రి కాన్వాయ్‌లను మాత్రమే అనుమతిస్తారు. విజింజం పరిసరాల్లో పార్కింగ్‌పై ఆంక్షలు విధించారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు