ఇండియా, పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని పోలుస్తూ రిటైర్డ్ పాకిస్తానీ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనికుల సంఖ్యలో వ్యత్యాసం, పెరుగుతున్న ఉద్రిక్తతలను ఆయన హైలైట్ చేశారు... ఈ క్రమంలోనే భారత్ ముందు పాకిస్థాన్ నిలవలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
India Pakistan ఇండియాపై పాకిస్తాన్ చేస్తున్న దాడులు పాకిస్థాన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఒకరు కంగారు వ్యక్తం చేసారు. ఒకవేళ భారత్ పూర్తిస్థాయిలో పాక్ పై దాడిచేస్తే తట్టుకుని నిలవడం కష్టమనేలా సదరు ఆర్మీమెన్ కామెంట్స్ చేసారు. ఇలా పాకిస్థాన్ వాయుసేనలో గతంలో పనిచేసిన ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ సైనిక బలం చక్కువని.. ఇండియా వద్ద భారీ సైన్యం ఉందని పేర్కొన్నాడు. ఇండియాలో 16 లక్షల మంది సైనికులు ఉంటే పాక్ లో కేవలం ఆరు లక్షలే ఉన్నారని గుర్తుచేసాడు. కాబట్టి ఇండియాతో పాక్ ఎక్కువ కాలం పోరాడలేదని మసూద్ అక్తర్ పేర్కొన్నాడు.
పాకిస్తానీ సైనికులు శుక్రవారం రాత్రి పాఠశాల, వైద్య సౌకర్యాలు వంటి పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పశ్చిమ సరిహద్దులో దాడులు కొనసాగించారని భారత ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ ఉదయం ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, అగ్ర రక్షణ కమాండర్లు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్లతో కలిసి పాకిస్తాన్ దాడులు, భారతదేశం ప్రతిస్పందన గురించి వివరించారు.
నియంత్రణ రేఖ వెంబడి పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ బహుళ వైమానిక దాడులు చేసింది, కొంతమంది పౌరులను చంపిందని వింగ్ కమాండర్ సింగ్ చెప్పారు. భారత దళాలు వేగంగా స్పందించి, గుర్తించిన సైనిక లక్ష్యాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని ఆమె అన్నారు.
సరిహద్దు నుండి భారత భూభాగంలోకి రాత్రిపూట ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషించిన S-400 వైమానిక రక్షణ వ్యవస్థ. అయితే దీనిపై దాడి చేసినట్లు పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం ఖండించింది. ఇందులో నిజం లేదని... S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం పనిచేస్తోందని భారత్ ప్రకటించింది.