చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని పాక్ జాతీయురాలు సీమా హైదర్ ఉపవాసం (Video)

Published : Aug 23, 2023, 03:37 PM IST
చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని పాక్ జాతీయురాలు సీమా హైదర్ ఉపవాసం (Video)

సారాంశం

చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావాలని పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ ఈ రోజు ఉపవాసం ఉంటున్నారు. తనకు అనారోగ్యం ఉన్నప్పటికీ చంద్రయాన్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యే వరకు ఉపవాసం ఉంటానని ఆమె ఓ వీడియోలో చెప్పారు.  

న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ఉపవాసం చేస్తున్నారు. చంద్రయాన్ 3 బుధవారం సాయంత్రం అంటే మరికొన్ని రోజుల్లో ల్యాండింగ్ కానుంది. ఈ సందర్భంగానే చంద్రయాన్ 3 విజయవంతం కావాలని సీమా హైదర్ ఉపవాసం చేపట్టినట్టు ఓ వీడియోలో పేర్కొంది. ఈ వీడియోను సీమా హైదర్ లాయర్ ఏపీ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

‘నా హెల్త్ బాగోలేదు. కానీ, చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ఈ రోజు ఉపవాసం ఉంటున్నాను. ఈ రోజు చంద్రయాన్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇది భారత విజయాల్లో కీలక మైలురాయి అవుతుంది. చంద్రయాన్ విజయవంతంగా జాబిల్లిపై దిగే వరకు నేను ఉపవాసం ఉంటాను.  నేను ఎంతో విశ్వసించే రాధా క్రిష్ణ, శ్రీ రాముడికి పూజలు చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు కోసం మన ప్రధానమంత్రి ఎంతో కష్టపడ్డారు. ఈ చంద్రయాన్ విజయవంతంగా ల్యాండ్ అయితే భారత పేరు ప్రపంచంలో మార్మోగుతుంది. రాధే, రాదేధ, రాధే, క్రిష్ణ’ అని సీమా హైదర్ ఆ వీడియోలో మాట్లాడారు. 

Also Read: చంద్రయాన్ 3 పై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే

ఆమె లాయర్ మాట్లాడుతూ.. చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.  షెడ్యూల్ ప్రకారమే చంద్రయాన్ విజయవంతంగా ల్యాండ్ అవుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu