ఒడిశా రైలు ప్రమాదం : రాజ‌కీయం చేయ‌కండి.. స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి క‌లిసి రండి : కేంద్ర‌మంత్రి అనురాగ్ ఠాకూర్

Published : Jun 04, 2023, 02:53 PM IST
ఒడిశా రైలు ప్రమాదం : రాజ‌కీయం చేయ‌కండి.. స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి క‌లిసి రండి : కేంద్ర‌మంత్రి అనురాగ్ ఠాకూర్

సారాంశం

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఒడిశా రైలు దుర్ఘటనపై ప్రతిపక్షాలు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ  ప్రభుత్వాన్ని టార్గెట్  చేస్తూ విమ‌ర్శ‌ల‌తో పాటు ప్రశ్న‌లు గుప్పిస్తున్నాయి. అయితే, ఇలాంటి విషాద సమయంలో దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందనీ, ఇలాంటి అంశాలను రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.  

Union Minister Anurag Thakur: ఒడిశా రైలు ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఒడిశా రైలు దుర్ఘటనపై ప్రతిపక్షాలు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ  ప్రభుత్వాన్ని టార్గెట్  చేస్తూ విమ‌ర్శ‌ల‌తో పాటు ప్రశ్న‌లు గుప్పిస్తున్నాయి. అయితే, ఇలాంటి విషాద సమయంలో దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందనీ, ఇలాంటి అంశాలను రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఒడిశా రైలు ప్రమాదంపై ప్రతిపక్ష నేతల స్పందనల నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం మాట్లాడుతూ, దీనిపై రాజకీయాలు చేయకుండా కొన్ని అంశాలపై దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామనీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం, వారు త్వరగా కోలుకోవడానికి తోడ్పడటమే ప్రస్తుత లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. రైలు ఢీకొని మరణించిన వారి సంఖ్య 275కు చేరుకోగా, 1,100 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశా రైలు ప్ర‌మాదంపై ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామనీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంపై ప్రస్తుతం దృష్టి సారించామన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారనీ, ఇలాంటి అంశాలను రాజకీయం చేయొద్దని తాను భావిస్తున్నాన‌ని చెప్పారు.  యావ‌త్ దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఒడిశాలోని బాల‌సోర్ లో ట్రిపుల్ రైలు ప్రమాద బాధితుల గురించి మాట్లాడుతూ.. ఇలాంటి క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసిన ఆయన, ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలను కోరుతున్నానని చెప్పారు. ఇలాంటి సమయంలో దేశం ఏకతాటిపైకి రావాలని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తాము ప్రజలకు సహాయం చేస్తున్నప్పుడు, కొంతమంది ఇప్పటికీ రాజకీయాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇది ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ అవసరం లేదని అన్నారు. ఇది మనందరికీ తీరని లోటనీ, కొన్ని విషయాల్లో అందరూ కలిసి రావాలన్నారు.

కాగా, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు ప్రధాన మార్గంలోకి వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారనీ, అయితే దానిని తొలగించి రైలు లూప్ లైన్ లోకి ప్రవేశించి అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదానికి మూలకారణాన్ని గుర్తించామనీ, మృతదేహాలను తొలగించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం ఉదయానికల్లా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, తద్వారా ఈ ట్రాక్ పై రైళ్లు నడపడం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!