ఢిల్లీలో దారుణం.. ఆస్పత్రి టాయిలెట్లో నవజాత శిశువు హత్య.. తల్లీదండ్రులు అరెస్ట్...

Published : Jun 24, 2023, 06:53 AM IST
ఢిల్లీలో దారుణం.. ఆస్పత్రి టాయిలెట్లో నవజాత శిశువు హత్య.. తల్లీదండ్రులు అరెస్ట్...

సారాంశం

ఓ తల్లి నవజాత శిశువును ఆస్పత్రి టాయిలెట్లో చంపేసి వెళ్లి పోయిన దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. 

ఢిల్లీ : దేశ  రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆసుపత్రి మరుగుదొడ్డిలో పడేసి,  అమానవీయంగా చంపేసింది ఓ తల్లి.  ఆ తర్వాత ఆమె, ఆమెతో పాటు వచ్చిన మిగతా వారందరూ కనిపించకుండా పోయారు. ఈ ఘటన ఐదు నెలల క్రితం ఢిల్లీలో చోటుచేసుకుంది. అప్పటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. ఐదు నెలల తర్వాత ఈ ముఠాను అరెస్ట్ చేశారు. సదరు మహిళను సీమగా గుర్తించారు. ఆమె ఢిల్లీలోని విజయ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది.

సీమ, సందీప్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. నెలలు వినడంతో జనవరి 20న ఢిల్లీ బుద్ధవిహార్ లోని ఓ ఆసుపత్రికి నలుగురు వ్యక్తులు ఆమెను తీసుకువచ్చారు. అయితే,  ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువగా వస్తుండడంతో..  డాక్టర్ వచ్చేసరికే కాన్పు అయిపోయింది. అలా ఆసుపత్రి టాయిలెట్ లోనే  బిడ్డకు  జన్మనిచ్చింది. అయితే, ఆ బిడ్డను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న ఆ తల్లి..  శిశువును అక్కడే చం పేసి మరుగుదొడ్డిలో పడేసింది. 

ప్రకాశం జిల్లా దర్శిలో భారీ అగ్ని ప్రమాదం...

ఆ తర్వాత  ఆ మహిళ, ఆమెతో పాటు వచ్చిన నలుగురు అక్కడి నుంచి కనిపించకుండా మాయమయ్యారు. కాసేపటి తరువాత ఆసుపత్రి సిబ్బంది విషయం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో ఎంత వెతికినా, ఎవరు? ఏమిటి? అనే విషయాలు తెలియ రాలేదు. దీంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐదు నెలల తర్వాత ఈ ముఠాను గుర్తించారు.

పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న  దాదాపు 250 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఈ క్రమంలోనే సందీప్ ఓ మెడికల్ షాప్ దగ్గర మందులు  కొంటుండడం గమనించారు. వెంటనే ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ అతను చేసిన పేటీఎం పేమెంట్ల ఆధారంగా  నిందితుడి ఆచూకీ  కనిపెట్టారు. సందీప్ ను, సీమను.. వారితో పాటు వచ్చిన వారందరినీ అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌