భూకంప సహాయక సామగ్రితో ట‌ర్కీకి బ‌య‌లుదేరిన‌ భార‌త బృందం.. డాగ్ స్క్వాడ్లు, వైద్య సామాగ్రి..

Published : Feb 07, 2023, 09:35 AM IST
భూకంప సహాయక సామగ్రితో ట‌ర్కీకి బ‌య‌లుదేరిన‌ భార‌త బృందం.. డాగ్ స్క్వాడ్లు, వైద్య సామాగ్రి..

సారాంశం

New Delhi: భూకంప బాధిత దేశ‌మైన టర్కీకి భూకంప సహాయక సామగ్రితో భార‌త‌ తొలి బ్యాచ్ బ‌య‌లుదేరింది. టర్కీలో సోమవారం మూడు బలమైన భూకంపాలు సంభవించి వేలాది మంది మరణించడంతో టర్కీకి సహాయం చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, వైద్య సామాగ్రి, డ్రిల్లింగ్ యంత్రాలు స‌హా ఇతర అవసరమైన పరికరాలను పంపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి టర్కీకి బయలుదేరిన చిత్రాలను, వీడియోలను సోష‌ల్ మీడియాల‌లో పంచుకున్నారు.  

Turkey-syria earthquake: వ‌రుస భూకంపాల‌తో ట‌ర్కీ అత‌లాకుత‌లం అవుతోవంది. ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద పెద్ద భ‌వ‌నాలు, ఇండ్లు కుప్ప‌కూలాయి. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. స‌హాయ చ‌ర్య‌లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌కృతి విప‌త్తు కార‌ణంగా దారుణ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ట‌ర్కీకి సాయం చేయ‌డానికి భార‌త్ ముందుకు వ‌చ్చింది. టర్కీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో ఎన్డీఆర్ఎఫ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ కలిసి భూకంప బాధిత దేశానికి తొలి బ్యాచ్ సహాయక సామగ్రి బయలుదేరింది.

భూకంప బాధిత దేశ‌మైన టర్కీకి భూకంప సహాయక సామగ్రితో భార‌త‌ తొలి బ్యాచ్ బ‌య‌లుదేరింది. టర్కీలో సోమవారం మూడు బలమైన భూకంపాలు సంభవించి వేలాది మంది మరణించడంతో టర్కీకి సహాయం చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, వైద్య సామాగ్రి, డ్రిల్లింగ్ యంత్రాలు స‌హా ఇతర అవసరమైన పరికరాలను పంపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి టర్కీకి బయలుదేరిన చిత్రాలను, వీడియోలను సోష‌ల్ మీడియాల‌లో పంచుకున్నారు.

 

భూకంపంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన ట్వీట్ పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భార‌త్ అన్ని విధాలా సహకరిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ప్ర‌ధాని మోడీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టర్కీ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అలాగే, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. సిరియా ప్రజల బాధలో తాము భాగస్వాములమనీ, ఈ క్లిష్ట సమయంలో సహాయ సహకారాలు అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన మరో ట్వీట్లో పేర్కొన్నారు.

టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 3000 మందికి పైగా మరణించగా, వేలాది మంది గాయపడిన తర్వాత భూకంప బాధిత టర్కీకి సహాయక సామగ్రితో కూడిన సెర్చ్ అండ్ రెస్క్యూ, వైద్య బృందాలను భారత్ వెంటనే పంపుతుందని ఎంఈఏ సోమవారం తెలిపింది. ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, అవసరమైన పరికరాలతో 100 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన రెండు బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతానికి గాలింపు, సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయి. శిక్షణ పొందిన వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో అవసరమైన మందులతో వైద్య బృందాలను సిద్ధం చేస్తున్నట్లు ఈఏఎం అంత‌కుముందు తెలిపింది.

దక్షిణ టర్కీలో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా టర్కీ, పొరుగున ఉన్న సిరియాలో దాదాపు 4 వేల మందికి పైగా మరణించారు. గత వందేళ్లలో ఈ ప్రాంతంలో సంభవించిన భూకంపం అత్యంత బలమైనదనీ, లెబనాన్, ఇజ్రాయెల్ సహా ఈ ప్రాంతం అంతటా పలు బలమైన ప్రకంపనలు సంభవించాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu