National Mock Drills: దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. కేంద్రం సంచలన ఆదేశాలు.. యుద్ధానికి సిద్ధమా?

Published : May 05, 2025, 07:29 PM IST
National Mock Drills: దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. కేంద్రం సంచలన ఆదేశాలు.. యుద్ధానికి సిద్ధమా?

సారాంశం

National Mock Drills for Civil Defence Preparedness on May 7: మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడుల హెచ్చరికలను పరీక్షించడం, పౌరులకు శిక్షణ ఇవ్వడం, తరలింపు ప్రణాళికలను రిహార్సల్ చేయడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

MHA orders nationwide civil defence mock drills on May 7:  పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండు దేశాలు మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు పంపుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీచేసింది. మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రు దాడి జరిగితే పౌరులను రక్షించడానికి సమర్థవంతమైన సంసిద్ధత, ప్రతిస్పందన విధానాలు అమలులో ఉన్నాయని నిర్ధారించుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా ఉన్నాయి. 

మాక్ డ్రిల్స్ సమయంలో తీసుకోవాల్సిన ముఖ్య చర్యలు

1. వైమానిక దాడి హెచ్చరిక సైరన్‌ల పనితీరు: వైమానిక దాడి హెచ్చరిక సైరన్‌లను యాక్టివేట్ చేసి, అంచనా వేయడం ఈ డ్రిల్‌లో కీలకమైన అంశం. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో హెచ్చరికలు అందించేలా చూసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

2. పౌరులు, విద్యార్థులకు శిక్షణ: పౌరులు, విద్యార్థులకు అవసరమైన పౌర రక్షణ చర్యలపై శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెడతారు. దాడి సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలో ఆచరణాత్మక మార్గదర్శకత్వం అందిస్తారు.

3. బ్లాక్‌అవుట్ చర్యలు: శత్రు దాడుల సమయంలో కనిపించకుండా ఉండేందుకు బ్లాక్‌అవుట్ విధానాలను అమలు చేయడం చాలా ముఖ్యం. ఈ డ్రిల్స్‌లో "యాక్సిడెంటల్ బ్లాక్‌అవుట్" చర్యలను ప్రాక్టీస్ చేస్తారు. అవసరమైనపుడు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ద్వారా శత్రువులు లక్ష్యాలను గుర్తించకుండా ఉండేలా చేయడం కూడా ఇందులో ఉంటుంది. 

4. కీలక ప్రదేశాల మభ్యపెట్టడం: జాతీయ భద్రతకు కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడం చాలా ముఖ్యం. ఈ డ్రిల్స్‌లో కీలక ప్లాంట్లు, యూనిట్లను మభ్యపెట్టే విధానాలు ఉంటాయి.

5. తరలింపు ప్రణాళిక, రిహార్సల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా తరలించడానికి సరైన ప్రణాళిక, రిహార్సల్ అవసరం. ఈ డ్రిల్స్‌లో ప్రస్తుత తరలింపు ప్రణాళికలను అప్‌డేట్ చేయడం, పూర్తిస్థాయి రిహార్సల్ నిర్వహించడంపై దృష్టి పెడతారు.

యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.. 

తాజాగా మాక్ డ్రిల్  ఆదేశాలు ఇప్పుడు వెలువడటం ముఖ్యంగా గమనించదగిన అంశం. ఇటీవల దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఆ దాడిలో మొత్తం 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్‌పై అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యమైనవి: సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం, పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, అటారి చెక్‌పోస్ట్ మూసివేత, అన్ని రకాల తపాలా సేవలు నిలిపివేత ఇలా దాదాపు పాకిస్తాన్ తో ఉన్న అన్ని ఒప్పందాలను భారత్ కట్ చేసింది. 

ఇదే సమయంలో పాకిస్తాన్ వరుసగా భారత్ ను రెచ్చగొట్టే విధంగా కామెట్స్ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మాక్ డ్రిల్లులు, ప్రజల అవగాహన పెంపు, సమయానుకూల చర్యలు తీసుకునే దిశగా ముందడుగుగా చూడవచ్చు. ఈ శిక్షణలు దేశవ్యాప్తంగా అన్ని వయసులవారికి అవసరమైన భద్రతా విధానాలను తెలియజేయడంలో సహాయపడతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?