
Tamil Nadu Chief Minister and DMK Chief MK Stalin: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా విపక్షాలు అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన పోడ్కాస్ట్ 'స్పీకింగ్ ఫర్ ఇండియా' మొదటి ఎపిసోడ్ లో పలు అంశాలను ప్రస్తావిస్తూ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. అనేక హామీలను బీజేపీ పూర్తి చేయలేకపోయిందనీ, భారతదేశ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ నరేంద్ర మోడీ మోడల్ అంతం కాబోతోందని ఆయన పేర్కొన్నారు.
'ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైంది'
ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ నెరవేర్చలేకపోయిందని స్టాలిన్ అన్నారు. భారతదేశం కోసం మాట్లాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, భారతీయులు ఇంతకాలం అభిమానించిన ఐక్యతా భావాన్ని నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. తాను ప్రజల్లో ఒకరైన వ్యక్తిగా భారతదేశం కోసం మాట్లాడాలనుకుంటున్నాననీ, మనమందరం భారతదేశం కోసం మాట్లాడాల్సిన సమయంలో ఉన్నామని చెప్పారు. బీజేపీ భారతదేశ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందనీ, భారతీయులు ఇంతకాలం ఆదరించిన, పరిరక్షించిన ఐక్యతా భావాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాల విషయంలో నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
బీజేపీ నేరవేర్చడంలో విఫలైమన హామీలు అంటూ..
ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫల అంశాలు చాలానే ఉన్నాయని స్టాలిన్ అన్నారు. త్వరలోనే బీజేపీ పాలనకు పదేళ్లు పూర్తవుతాయనీ, ఆ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు.
'నరేంద్ర మోదీ మోడల్ అంతం కాబోతోంది'
ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన ప్రసంగాల్లో 'గుజరాత్ మోడ్'ను ప్రస్తావిస్తూ, 'గుజరాత్ మోడల్' అని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ మోడల్ ఇప్పుడు తమదిగా చెప్పుకోవడానికి చెప్పుకోదగిన మోడల్ లేకుండా ముగిసిపోతుందని స్టాలిన్ అన్నారు. తమది తిరుగులేని మోడల్ గా మారిందని స్టాలిన్ అన్నారు. తమిళనాడులో ద్రవిడ నమూనా సాధించిన విజయాలను గణాంక ఆధారాలతో తమ పార్టీ జాబితా చేసిన తరువాత, ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన గుజరాత్ మోడల్ గురించి పెద్ద వాదనలు కూడా లేవని ఆయన అన్నారు. భారతదేశపు బలమైన ప్రభుత్వ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం, నాశనం చేయడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగాన్ని తన కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టేందుకు బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.