ఆ కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య.. లాడ్జిలో దిగిన తర్వాత నలుగురి బలవన్మరణం.. ఎందుకంటే?

Published : Apr 01, 2023, 02:00 PM IST
ఆ కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య.. లాడ్జిలో దిగిన తర్వాత నలుగురి బలవన్మరణం.. ఎందుకంటే?

సారాంశం

కర్ణాటకలో మైసూరుకు చెందిన ఓ కుటుంబం మొత్తంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఓ లాడ్జిలో దిగిన తర్వాత ముందుగా పిల్లలకు విష ఆహారం తినిపించి చంపేశారు. ఆ తర్వాత భార్యను గొంతు నులిమి చంపి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.  

బెంగళూరు: కర్ణాటకలో ఓ కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ లాడ్జిలో దిగిన ఆ దంపతులు ఇద్దరు కుమార్తెలను చంపి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళూరులో చోటుచేసుకుంది. మూడు రోజులకు పైగా ఆ కుటుంబం లాడ్జి గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో సిబ్బంది స్పేర్ కీతో డోర్ తీయగా ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.

మృతులను పోలీసులు గుర్తించారు. దేవేంద్ర (48), ఆయన భార్య నిర్మల (46), ఈ దంపతుల కవల కూతుళ్లు చైత్ర, చైతన్యలుగా ధ్రువీకరించారు. చైత్ర, చైతన్యలు తొమ్మిదేళ్ల చిన్నారులు. ఈ కుటుంబం మైసూరుకు చెందినది. 

ఈ కుటుంబం మార్చి 27వ తేదీన లాడ్జిలో దిగింది. మూడు రోజులపాటు బసకు ఏర్పాటు చేసుకున్నారు. 30వ తేదీన వారు వెకేట్ చేయాలి. కానీ, ఆ తేదీ దాటినా ఇంకా వారు బయటకు రాలేదు. దీంతో అనుమానంతో సిబ్బంది స్పేర్ కీ సహాయంతో డోర్ తెరిచారు. అంతే.. నలుగురి మృతదేహాలు కనిపించాయి. ఆర్థిక సమస్యల వల్ల ఆ కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు చెప్పారు.

Also Read: మత్తాలి శివారెడ్డా మజాకా.. ఐపీఎల్ కామెంట్రీలో బోజ్‌పురి రూటే సెపరేటు.. ఇంగ్లీష్ కామెంటేటర్స్ ఎందుకూ పనికిరారు

ముందుగా పిల్లలను ఆహారంలో విషం కలిపి చంపేశారని అనుమానిస్తున్నారు. ఆ తర్వాత దేవేంద్ర.. తన భార్య నిర్మలను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం, దేవేంద్ర కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దేవేంద్ర ఉరి  తాడుకు వేలాడుతూ కనిపించాడు. భార్య, ఇద్దరు పిల్లలు బెడ్ పై విగత జీవులుగా కనిపించారు. ఆ గది నుంచి ఓ డెత్ నోట్ లభించింది. ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్య నిర్ణయానికి వచ్చామని అందులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial