బిహార్‌లో సెల్ టవర్‌కే ఎసరు పెట్టిన దొంగలు.. పట్టపగలు 4 గంటలు శ్రమించి అపహరణ

Published : Apr 16, 2023, 06:02 AM IST
బిహార్‌లో సెల్ టవర్‌కే ఎసరు పెట్టిన దొంగలు.. పట్టపగలు 4 గంటలు శ్రమించి అపహరణ

సారాంశం

బిహార్‌లో కొందరు దొంగలు పట్టపగలే మొబైల్ టవర్‌ను మాయం చేశారు. ఆ సెల్ టవర్ పని చేయడం లేదని, అందుకే దాన్ని తొలగిస్తున్నామని, ఆ కంపెనీ అధికారులుగా వారు స్థానికులను నమ్మించి చోరీ చేశారు. ముజ‌ఫర్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  

పాట్నా: బిహార్‌లో దొంగలు ఊహకు అందని రీతిలో చోరీలకు పాల్పడుతున్నారు. ఒక ప్రొఫెషనల్ వేలో వారు చోరీలు చేస్తున్నారు. పట్టపగలు.. బహిరంగంగా అందరూ చూస్తుండగానే ఈ దొంగతనాలు జరగడం చర్చనీయాంశం అవుతున్నది. ఐరన్ బ్రిడ్జీని కూల్చేసి కాజేయడం, ట్రైన్ బోగీలనూ మాయం చేయడం వంటి నమ్మలేని అపహరణలు బిహార్‌లో జరిగాయి. తాజాగా, అదే కోవలోకి వెళ్లే ఘటన జరిగింది. ఓ దొంగల ముఠా ముజఫర్‌పూర్‌లో పట్టపగలే ఏకంగా సెల్ టవర్‌ను కాజేశారు.

ముజఫర్‌పూర్‌లో సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రమజీవి నగర్ ఏరియాలో జీటీఏఎల్ కంపెనీ ఓ మొబైల్ టవర్ ఏర్పాటు చేసింది. మనీషా కుమారి ఇంటిలో ఈ టవర్ ఏర్పాటు చేసింది. ఈ టవర్ ఇన్‌స్పెక్షన్ కోసం ఇటీవలే అధికారులు మనీషా కుమారి ఇంటికి చేరి ఖంగుతిన్నారు. అక్కడ వారు ఏర్పాటు చేసిన టవర్ కనిపించలేదు. 

కంపెనీ అధికారి షానవాజ్ అన్వర్ సదర్ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తులో మనీషా కుమారి కీలక విషయాలు వెల్లడించింది. 

కొందరు వ్యక్తులు జీటీఏఎల్ కంపె నీ అధికారులను పేర్కొంటూ కొన్ని నెలల క్రితం అక్కడకు వచ్చారని, ఆ టవర్ పని చేయడం లేదని, కాబట్టి, దాన్ని తొలగిస్తున్నట్టు తమకు చెప్పారని వివరించింది. ఆ టవర్‌ను పట్టపగలు నాలుగు గంటలు పని చేసి విడి భాగాలు విప్పారు. వెంట తెచ్చుకున్న ట్రక్కులో వాటిని లోడ్ చేసుకున్నారు. టవర్‌తోపాటు అక్కడ ఉంచిన జనరేటర్, స్టెబిలైజర్, మరికొన్ని వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి.

Also Read: Atiq Ahmed: అతీక్ హత్యపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన.. జై శ్రీరాం నినాదాలు ఇచ్చారు..కోర్టులు, న్యాయవ్యవస్థ ఎందుకు?

ఈ ఎక్విప్‌మెంట్ విలువ సుమారు రూ. 4.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

బిహార్‌లో ఇలా మొబైల్ టవర్‌ను చోరీ చేయడం ఇది రెండోసారి. పాట్నాలోని సబ్జీ బాగ్ ఏరియా నుంచీ ఇదే రీతిలో మొబైల్ టవర్‌ను అపహరించారు.

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu