బీజేపీలోకి ‘ మెట్రో ’ శ్రీధరన్.. త్వరలో కేరళ అసెంబ్లీ బరిలోకి..?

Siva Kodati |  
Published : Feb 18, 2021, 02:16 PM IST
బీజేపీలోకి ‘ మెట్రో ’ శ్రీధరన్.. త్వరలో కేరళ అసెంబ్లీ బరిలోకి..?

సారాంశం

భారత్‌లో మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇంజినీర్‌ శ్రీధరన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది.

భారత్‌లో మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇంజినీర్‌ శ్రీధరన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది.

కేరళలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శ్రీధరన్‌ అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటం, ముఖ్యంగా కాషాయ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

కేరళలో ఈ ఆదివారం బీజేపీ నిర్వహిస్తోన్న విజయ్‌ యాత్రలో భాగంగా శ్రీధరన్‌ పార్టీలో చేరునున్నట్లు సమాచారం. 88 ఏళ్ల మెట్రోమ్యాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై శ్రీధరన్‌ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు నిజమేనని, అలాగే పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా సిద్ధమేనని వెల్లడించారు.

భారత దేశంలో మెట్రో రైళ్లకు రూపకల్పన చేసిన ఘనత శ్రీధరన్‌దే. ఈ రంగంలో అపార అనుభవమున్న ఆయన 2011లో ఢిల్లీ మెట్రో నుంచి పదవీ విరమణ పొందారు.  
 

PREV
click me!

Recommended Stories

ప్ర‌తిప‌క్షాల‌కు మోదీ, షా మాస్ట‌ర్ స్ట్రోక్‌.? మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు వీగినా బీజేపీకే లాభ‌మా.?
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరిగింది? | Asianet News Telugu