భారత్లో మెట్రోమ్యాన్గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇంజినీర్ శ్రీధరన్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది.
భారత్లో మెట్రోమ్యాన్గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇంజినీర్ శ్రీధరన్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది.
కేరళలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శ్రీధరన్ అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటం, ముఖ్యంగా కాషాయ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేరళలో ఈ ఆదివారం బీజేపీ నిర్వహిస్తోన్న విజయ్ యాత్రలో భాగంగా శ్రీధరన్ పార్టీలో చేరునున్నట్లు సమాచారం. 88 ఏళ్ల మెట్రోమ్యాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై శ్రీధరన్ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు నిజమేనని, అలాగే పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా సిద్ధమేనని వెల్లడించారు.
భారత దేశంలో మెట్రో రైళ్లకు రూపకల్పన చేసిన ఘనత శ్రీధరన్దే. ఈ రంగంలో అపార అనుభవమున్న ఆయన 2011లో ఢిల్లీ మెట్రో నుంచి పదవీ విరమణ పొందారు.