ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని.. దాదాపు 50మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.
ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని.. దాదాపు 50మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. బాధిత మహిళల ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కి.. జైల్లో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఒంటరిగా కనిపించిన యువతులు,మహిళలపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడి..వాటిని తన మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు తీసేవాడు. అనంతరం వారిని ఆ వీడియోలు చూపించి బ్లాక్ మొయిల్ చేసేవాడు. ఇప్పటి వరకు 50మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారిని బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కొద్దిరోజుల క్రితమే.. ఓ వివాహిత, ముగ్గురు ఐటీ ఉద్యోగినులు ఆ దుండగుడి మీద ఫిర్యాదు చేయడంతో.. ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కొద్ది రోజులుగా గాలింపు చర్యలు చేపట్టగా.. చివరకు పోలీసులకు చిక్కాడు. అతని మొబైల్ ఫోన్ లో 50మంది పైగా మహిళలను రేప్ చేసిన వీడియోలు చూసి పోలీసులు ఖంగుతిన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.