దారుణం : ఇనుపరాడ్లు చోరీ చేశాడని.. స్తంభానికి కట్టేసి కొట్టి.. చంపారు..

Published : May 06, 2023, 08:57 AM ISTUpdated : May 06, 2023, 08:58 AM IST
దారుణం : ఇనుపరాడ్లు చోరీ చేశాడని.. స్తంభానికి కట్టేసి కొట్టి.. చంపారు..

సారాంశం

ఇంటి నిర్మాణంలో ఉన్న ఇనుపరాడ్లను దొంగిలించాడని ఓ వ్యక్తిని అతి దారుణంగా.. కట్టేసి, కొట్టి చంపాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వెలుగు చూసింది. 

సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని దొంగతనం నేరం కింద కట్టేసి.. కొట్టడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జహీరాబాద్ శివారులోని ఓ వెంచర్లో  మహేష్ అనే వ్యక్తిని కట్టేసి, కొట్టి చంపారు. ఇక్కడ ఉన్న కాలనీలో  బాగారెడ్డిపల్లికి చెందినమహేష్ (32) అనే వ్యక్తి ఒంటరిగా ఉంటున్నాడు.

అతను ఉండేది ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఓ ఇంట్లో నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలో ఉన్న ఇనుపరాడ్లు దొంగతనానికి గురయ్యాయి. దీంతో దాని యజమాని ఆయన ఇనుప రాడ్లను మహేష్ దొంగిలించాడంటూ అతడిని నిలదీశాడు. ఆ తర్వాత అతడిని బలవంతంగా లాక్కెళ్ళి తన వెంచర్లోని స్తంభానికి కట్టేశాడు.  దొంగతనం ఎందుకు చేసావు అంటూ తీవ్రంగా కొట్టాడు.

గద్వాల జిల్లాలో దారుణం.. గాయాలకు కుట్లకు బదులు ఫెవీక్విక్ తో అతుకులు.. !

ఆ దెబ్బలకు తట్టుకోలేక మహేష్ మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులకు యజమాని సమాచారం ఇచ్చాడు. వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మహేష్ అప్పటికే మృతి చెందినట్లు తేలింది. వెంటనే వారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం జరగగా రాత్రి వరకు కూడా మృతుడి వైపు నుంచి ఎవరు ఫిర్యాదు చేయడానికి రాలేదు. దీంతో మృతుడు ఎవరో తెలియరాలేదని..  శనివారం నాడు  మిగతా విచారణ చేసి కేసు నమోదు చేస్తామని జహీరాబాద్ రూరల్ ఎస్సై పరమేష్ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu