కుక్కను చంపిన కేసులో వ్యక్తికి ఏడాది కఠిన కారాగార శిక్ష

Published : Apr 22, 2023, 12:44 AM IST
కుక్కను చంపిన కేసులో వ్యక్తికి ఏడాది కఠిన కారాగార శిక్ష

సారాంశం

మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి కుక్కను ఐరన్ రాడ్‌తో పొడిచి చంపాడు. ఈ కేసులో మఖాన్ సింగ్ దోషిగా తేలాడు. కోర్టు ఆయనకు ఏడాది కటిన కారాగార శిక్ష, రూ. 1,000 జరిమానా విధించింది.  

భిండ్: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి కుక్కను చంపాడని కేసు నమోదైంది. ఆ కేసులో అతనికి శిక్ష కూడా పడింది. ఏడాది కాలంపాటు కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు రూ. 1,000 జరిమానా కూడా వేసింది. 2019లో కుక్కను చంపిన ఘటన చోటుచేసుకుంది.

48 ఏళ్ల మఖాన్ సింగ్‌కు ఈ శిక్ష పడింది. కారాగార శిక్షతోపాటు రూ. 1,000 జరిమానా కూడా విధించింది. జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాకేశ్ కుమార్ కుష్వాహా ఈ తీర్పు వెల్లడించారు. 

Also Read: ఢిల్లీలో సహజీవన భాగస్వామి హత్య.. 12 కి.మీల దూరంలో డెడ్ బాడీ

2019లో ఓ కుక్క మఖాన్ సింగ్ పై ఉరుముతూ మొరిగింది. రౌపురా గ్రామంలో ఆ కుక్కను ఓ ఐరన్ రాడ్‌తో పొడిచి చంపేశాడు. 2019 ఏపర్ిల్ 30న ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత ఐపీసీలోని సెక్షన్ 429 (జంతువులను చంపేసినందుకు) కింద కేసు ఫైల్ అయింది. ఈ కేసులో మఖాన్ సింగ్ దోషిగా తేలాడు. దీంతో కోర్టు ఆయనకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 1,000 జరిమానా విధించింది. ఈ తీర్పు మంగళవారం వెలువడింది.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu