400 కిలోమీటర్ల మైలురాయిని దాటిన లోకేష్ పాదయాత్ర.. 32 రోజుల్లో 12 కేసులు నమోదు

Published : Mar 03, 2023, 01:08 PM IST
400 కిలోమీటర్ల మైలురాయిని దాటిన లోకేష్ పాదయాత్ర.. 32 రోజుల్లో 12 కేసులు నమోదు

సారాంశం

ఏపీలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర గురువారం నాటికి 32 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఆయనపై పాదయాత్ర మొదలు పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదు అయ్యాయి. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ 4 వేల కిలోమీటర్ల ‘యువగళం’ పాదయాత్ర 400 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేపట్టిన మారథాన్‌ గురువారం నాటికి 32 రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయనపై 12 కేసులు నమోదయ్యాయి. 

కశ్మీర్‌లో టెర్రరిస్టులు నా వద్దకు వచ్చి మాట్లాడారు.. నన్ను చంపేసేవారు: కేంబ్రిడ్జీ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ

కాగా.. తిరుపతి జిల్లాలోని నేండ్రగుంట గ్రామంలో 400 కిలోమీటర్ల మైలురాయిని గుర్తు చేస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మాజీ మంత్రి బుధవారం ఆవిష్కరించారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాను చేస్తున్న 'చారిత్రక' పాదయాత్రకు సంఘీభావం తెలిపినందుకు, ఇన్ని రోజులు తన వెంట నడిచినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

విదేశీ మద్యం అక్రమరవాణా కేసులో గుజరాత్ మహిళా కాంగ్రెస్ నేత అరెస్ట్...

ఈ సందర్భంగా టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ‘ప్రజాస్వామ్య’ విధానాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘లోకేశ్‌ మారథాన్‌తో ఉలిక్కిపడిన రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా ఆయనపై 12 కేసులు నమోదు చేసింది. పాదయాత్ర సాగిన ప్రతి 33 కిలో మీటర్లు చొప్పున ఒకటి చొప్పున కేసు నమోదు అయ్యింది. పాదయాత్రను అడ్డుకోవాలనే అధికార పార్టీ ఉద్దేశాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది.’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నూతన భారత నిర్మాణంలో ఏపీ కీలకపాత్ర: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అంబానీ

లోకేష్‌పై తప్పుడు కేసులు బనాయించి ముఖ్యమంత్రిని మభ్యపెట్టే ప్రయత్నాలను మానుకోవాలని నక్కా ఆనంద్‌బాబు పోలీసులను హెచ్చరించారు. ఈ అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దించే వరకు టీడీపీ నాయకుడి పాదయాత్ర ఆపేది లేదన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu