Life Expectancy Report: ఎవరు ఎక్కువ కాలం జీవిస్తారు? భారతీయులా? లేదా చైనీయులా? 

Published : Jul 07, 2022, 04:58 AM ISTUpdated : Jul 07, 2022, 04:59 AM IST
Life Expectancy Report: ఎవరు ఎక్కువ కాలం జీవిస్తారు? భారతీయులా? లేదా చైనీయులా? 

సారాంశం

Life Expectancy Report: భారతీయుల కంటే చైనా పౌరులు ఎక్కువగా జీవిస్తున్నారని లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ (సగటు జీవితకాలం) నివేదిక వెల్లడించింది. చైనా పౌరుల ఆయుర్దాయం 77.93 సంవత్సరాలని, ఇది  ఎగువ మధ్య-ఆదాయ దేశాల విభాగంలో అత్యధికమ‌ని NHC ప్లానింగ్ విభాగం డైరెక్టర్ మావో కునాన్ తెలిపారు.

Life Expectancy Report: భారతీయుల కంటే చైనా పౌరులు ఎక్కువ కాలం జీవిస్తున్నారని, చైనీయుల సగటు ఆయుర్దాయం పెరిగిందని జాతీయ ఆరోగ్య కమిషన్ (NHC) రూపొందించిన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ నివేదిక వెల్ల‌డించింది. తాజాగా విడుద‌లైన ఈ నివేదిక‌లో చైనా పౌరుల ఆయుర్దాయం 77.93 సంవత్సరాలు పేర్కొన‌బడింది. ఎగువ మధ్య-ఆదాయ దేశాల విభాగంలో ఇది అత్యధికం.  ప్రస్తుతం చైనా తలసరి ఆయుర్దాయం 77.93 ఏళ్లకు పెరిగిందని NHC ప్లానింగ్ విభాగం డైరెక్టర్ మావో కునాన్ తెలిపారు.

హాంకాంగ్ లో అత్యధిక ఆయుర్దాయం 

2013 నుండి హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశంగా కొనసాగిస్తోంది. హాంకాంగ్‌లో పురుషులు, స్త్రీల సగటు ఆయుర్దాయం 85 సంవత్సరాల కంటే ఎక్కువ. అత్యధిక ఆయుర్దాయం పరంగా 
జపాన్, మకావు కూడా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి.

తాజా జనాభా లెక్కల ప్రకారం..  2020 నాటికి 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల చైనీస్ ప్రజల సంఖ్య 264 మిలియన్లకు చేరుకుంటుంది, ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 18.7 శాతం ఉంటుంది.. గత సంవత్సరం విడుదల చేసిన డేటా ప్రకారం..  చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) పాలన (1949) ప్రారంభమైన 35 సంవత్సరాలతో పోలిస్తే 2019 సంవత్సరంలో చైనా ప్రజల ఆయుర్దాయం 77.03కి పెరిగింది.
 
భారతదేశ ఆయుర్దాయం ఎంత‌?

అదే సమయంలో ఈ నివేదిక‌ భారతదేశం గురించి ప్ర‌స్త‌విస్తూ.. 2020 సంవత్సరంలో ఇక్కడి ప్రజల సగటు వయస్సు 70 సంవ‌త్స‌రాలుగా ఉంద‌ని పేర్కొంది. అదే సమయంలో భారత్‌ కంటే పాకిస్థాన్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడి ప్రజల ఆయుర్దాయం 67 సంవ‌త్స‌రాలని పేర్కొంది. అలాగే UK ఆయుర్దాయం  81సంవ‌త్సరాలు, USA ఆయుర్దాయం 77 సంవ‌త్స‌రాలుగా ఉంద‌ని తెలిపింది.

అదే సమయంలో, జపాన్ ప్రజల సగటు వయస్సు 85 సంవ‌త్స‌రాలు ఉండ‌గా... స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియ ప్రజల సగటు వయస్సు 83 సంవత్సరాలని పేర్కొంది. సింగపూర్ ఆయుర్దాయం 84 సంవ‌త్స‌రాలు, ఇటలీ ఆయుర్దాయం 82 సంవ‌త్స‌రాలుగా పేర్కొంది. 

చైనాలో జనాభా సంక్షోభం 

అయితే, చైనా తాజా జనాభా లెక్కల ప్రకారం.. ఆరోగ్య అక్షరాస్యత రేటు 25.4 శాతానికి పెరిగింది.  చైనీయులలో 37.2 శాతం మంది క్రమం తప్పకుండా శారీరక వ్యాయామంలో పాల్గొంటారు. అదే సమయంలో.. వృద్ధాప్య జనాభా పెరుగుతున్నప్పుడు దాని పిల్లల జననాలు భయంకరంగా క్షీణించడంతో చైనా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో వృద్ధుల సంరక్షణ, సౌకర్యాలను ప్రభుత్వం విస్తృతం చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ముగ్గురు పిల్లల చట్టం ఆమోదం

ప్రస్తుత జనాభా సంక్షోభానికి విధాన రూపకర్తలు నిందించే దశాబ్దాల నాటి ఒక బిడ్డ విధానాన్ని రద్దు చేస్తూ.. 2016లో దేశంలోని అన్ని జంటలకు ఇద్దరు పిల్లలను కనేందుకు చైనా అనుమతించింది. గత సంవత్సరం.. చైనా ఈ విధానంలో మ‌రోసారి మార్పు తెచ్చింది. ప్ర‌తి జంట ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా జనాభా, కుటుంబ నియంత్రణ చట్టాన్ని స‌వ‌రించింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా జంటల అయిష్టతను పరిష్కరించడానికి ఇది స్పష్టమైన ప్రయత్నం.

2020లో దశాబ్దానికి ఒకసారి జరిగే జనాభా గణనలో చైనా జనాభా 1.412 బిలియన్లకు నెమ్మదిగా పెరిగిందని తేలిన తర్వాత మూడవ బిడ్డను అనుమతించాలనే నిర్ణయం వచ్చింది. ఎత్తైన భూభాగం కారణంగా ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండే టిబెట్‌లో సగటు ఆయుర్దాయం 1951లో 35.5 సంవత్సరాల నుండి గత సంవత్సరం 72.19 సంవత్సరాలకు పెరిగిందని తెలిపింది.

2035 నాటికి ఆయుష్షును 80కి పెంచాలని చైనా లక్ష్యం 

ప్రధాన వ్యాధులకు వ్యతిరేకంగా చైనా కూడా తన రక్షణను పటిష్టం చేసిందని,  అకాల మరణాల రేటు ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందని ప‌లు నివేదిక‌లు తెలుపుతున్నాయి.   
2025 నాటికి చైనా తన ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఐదేళ్ల బ్లూప్రింట్‌ను మేలో సిద్ధం చేసింది. దీని ప్రకారం, 2025 నాటికి దేశ ప్ర‌జ‌ల ఆయుర్దాయాన్ని 78.93 సంవ‌త్స‌రాల‌కు పెంచాలని, శిశువులు, గర్భిణీ స్త్రీల మరణాల రేటును తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక ప్రకారం, 2035 సంవత్సరం నాటికి ఆయుర్దాయం 80 సంవ‌త్స‌రాల‌కు పెంచాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది.

చైనాలో ఆయుర్దాయం పెరగడానికి కారణాలు

ఆయుర్దాయం చెంద‌డానికి ప్రధానంగా ఆరోగ్య వాతావరణంపై దృష్టి పెట్టింది. దాని బ్లూప్రింట్‌లో.. ఆరోగ్య పరిజ్ఞానం, ఫిట్‌నెస్, పొగాకు నియంత్రణ, ఈ-సిగరెట్‌లను నిషేధించడం, మద్యపాన నిషేధం, సరైన ఆహారం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. మెడికల్ జర్నల్ లాన్సెట్ 2021 నివేదిక ప్ర‌కారం.. పేదరికం లేకపోవడం, వ్యాధుల తగ్గుదల కారణంగా హాంకాంగ్ యొక్క ఆయుర్దాయం అధికంగా పెరిగింద‌ని పేర్కొంది.  అభివృద్ధితో పాటు, ఆర్థిక శ్రేయస్సు, తగ్గిన ధూమపానం కూడా ఈ ఫలితాలను ఇచ్చాయని తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?