Maharashtra Politics: ఉద్ద‌వ్ సేన‌ V/s షిండే సేన‌.. పార్టీ గుర్తుపై పోరు.. వార‌సుల‌మేమేనంటున్నాఇరువ‌ర్గాలు

Published : Jul 07, 2022, 03:14 AM IST
Maharashtra Politics: ఉద్ద‌వ్ సేన‌ V/s షిండే సేన‌.. పార్టీ గుర్తుపై పోరు.. వార‌సుల‌మేమేనంటున్నాఇరువ‌ర్గాలు

సారాంశం

Maharashtra Politics: మహారాష్ట్రలో మ‌రో రాజకీయ వ్య‌వ‌హారం తీవ్ర దూమారం రేపుతోంది. తాజాగా మ‌రో 12 మంది ఎమ్మెల్యేలు షిండే వ‌ర్గంలో చేర‌నున్నార‌నే రెబ‌ల్ ఎమ్మెల్యేలు ప్ర‌క‌టించారు. పార్టీ గుర్తుపై రెబ‌ల్ ఎమ్మెల్యేల దావా.   

Maharashtra Politics: మహారాష్ట్రలో నెలకొన్న రాజ‌కీయ సంక్షోభానికి తెరపడినా..  తాజాగా రాష్ట్రంలో మరో విష‌యంలో కలకలం మొదలైంది. రాజకీయ తుఫాను రేపిన నిప్పురవ్వ..  శివసేనలో మంట పుట్టించింది. మొదటి ఎమ్మెల్యేలు,  తాజాగా పార్టీ కూడా ఎంపీ ఉద్ధవ్ ఠాక్రే నుంచి దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తలెత్తిన ఈ తుఫాన్ కారణంగా బుధవారం కూడా రోజంతా ఉత్కంఠ  నెలకొంది. 

ఉద్ధవ్ ఠాక్రేకు పార్టీ నేత ఆనందరావు అడ్సుల్ షాకిచ్చారు. ఆయన్ను పార్టీ సమావేశానికి పిలిచారు, అయితే సమావేశానికి హాజరు కాలేకపోయారని, ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. త‌న‌ నేతృత్వంలోని శివసేన లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా రాజన్ విచారేను నియమించింది, ఎంపీ భావ్నా గావ్లీ స్థానంలో ఆయనను నియ‌మించారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు సమయంలో మహారాష్ట్రలోని యవత్మాల్-వాషిమ్ నియోజకవర్గం ఎంపీ భావ్నా గావ్లీ ను బీజేపీలో చేరాలని సూచించారు. శివసేనకు లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు.

షిండే వర్గంలో మ‌రో 12 మంది ఎంపీలు చేరనున్నారా?

ఉద్ద‌వ్ వ‌ర్గంలోని 18 మంది ఎంపీల్లో 12 మంది త్వరలో ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరతారని రెబల్ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ రావ్ పాటిల్ సంచ‌ల‌న‌ ప్రకటించారు. షిండే వర్గం పార్టీ గౌరవాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన అన్నారు. గత ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో పాటిల్ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. 55 మందిలో 40 మంది ఎమ్మెల్యేలు (రెబల్‌ వర్గం) ఉన్నారని, 18 మంది ఎంపీల్లో 12 మంది తమ వెంట వస్తున్నారని చెప్పారు. అప్పుడు పార్టీ ఎవరిది? నలుగురు ఎంపీలను వ్యక్తిగతంగా కలిశాను. మా వెంట 22 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిపారు

పార్టీ గుర్తు వివాదం
 
గులాబ్ రావ్ పాటిల్ కూడా పార్టీ గుర్తుపై దావా వేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గమే నిజ‌మైన శివ‌సేన అనీ,  పార్టీకి చెందిన‌ఎన్నికల గుర్తు ‘విల్లు బాణం గుర్తు’కు నిజ‌మైన యజమానులం తామేన‌నీ ఆయన అన్నారు. మరోవైపు, ఈ వాదనపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శిబిరం నిరసన తెలిపింది. పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు, 22 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా షిండేకు మద్దతిస్తున్నారని పాటిల్ చెప్పారు. పార్టీకి చెందిన విల్లు బాణం ఎన్నిక‌ల గుర్తు కు తామే నిజమైన వారసులమ‌ని ప్ర‌క‌టించారు.

అంతకుముందు, శివసేన (షిండే వ‌ర్గం) చీఫ్ విప్ భరత్ గోగావాలే జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించినందుకు ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం సోమవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. అయితే, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు గౌరవ సూచకంగా నోటీసు ఇవ్వలేదు.

నిజ‌మైన శివసేన ఎవరిది?

(షిండే వ‌ర్గం) పార్టీ చీఫ్ విప్‌ భ‌ర‌త్ గోగావాలే జారీ చేసిన విప్‌లో శివసేన ఎమ్మెల్యేలందరూ విశ్వాస పరీక్షలో ఏకనాథ్ షిండేకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఆదివారం నాడు గోగావాలేను శివసేన చీఫ్ విప్‌గా గుర్తించారు. అయితే ఎవరి శివసేన అనే విషయంలో ఇరు వర్గాల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్‌నాథ్ షిండే వర్గం తమ తమ గ్రూపులే నిజమైన శివసేన అని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు