Jayalalitha: జయలలిత ఆభరణాలపై బెంగళూర్ కోర్టు సంచలన తీర్పు !!

Published : Jan 23, 2024, 11:55 PM IST
Jayalalitha: జయలలిత ఆభరణాలపై బెంగళూర్ కోర్టు సంచలన తీర్పు !!

సారాంశం

Jayalalitha: తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత బంగారు, వజ్రాభరణాలపై హక్కులకు సంబంధించి కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అక్రమాస్తుల కేసు విచారణ తరువాత కర్ణాటక అధికారులు జయలలిత ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.  

Jayalalitha: తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత బంగారు, వజ్రాభరణాలపై హక్కులకు సంబంధించి కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. జయలలిత బంగారు, వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదలాయించాలని  ప్రత్యేక కోర్టు ఆదేశించింది. దీని తర్వాత.. ఇప్పుడు ఈ ఆభరణాల విషయంలో తమిళనాడు ప్రభుత్వం మాత్రమే తుది నిర్ణయం తీసుకోనుంది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణను కర్ణాటక ప్రభుత్వం విచారణ చేసిన విషయం తెలిసిందే. బఆ సమయంలో కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఇతర వస్తువులు కోర్టు కస్టడీకి వచ్చాయి. జయలలిత బంగారు, వజ్రాల ఆభరణాలు కూడా ఇందులో భాగమేనని వెల్లడించింది. 
 
వాస్తవానికి .. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వస్తువుల వేలం ద్వారా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త టి నరసింహమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన 32 అదనపు సిటీ సివిల్ ,సెషన్స్ కోర్టుకు అధ్యక్షత వహించిన న్యాయమూర్తి హెచ్‌ఎ మోహన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. కేసు దర్యాప్తు సందర్భంగా జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలను వేలం వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. 

బదులుగా.. ఈ జప్తు చేసిన విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మెటీరియల్ సాక్ష్యంగా పరిగణించిన బంగారం, వజ్రాభరణాలపై హక్కులను తమిళనాడు ప్రభుత్వానికి కల్పించింది. "ఆభరణాలను వేలం వేయడానికి బదులుగా, తమిళనాడు రాష్ట్ర హోం శాఖ ద్వారా వాటిని అప్పగించడం ద్వారా తమిళనాడుకు బదిలీ చేయడం మంచిది" అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అన్నారు. ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులకు జయలలిత కుటుంబానికి అర్హత లేదని గతంలో కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జయలలిత మేనకోడలు జె దీపా, మేనల్లుడు జె దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది. 

తమిళనాడు హోం శాఖ సెక్రటరీ స్థాయి అధికారులు పోలీసులతో కలిసి బెంగళూరుకు వచ్చి తమ వెంట ఆభరణాలను తీసుకెళ్లవచ్చని కోర్టు పేర్కొంది.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నిర్వహణకు చేసిన ఖర్చులకు గాను కర్ణాటకకు తమిళనాడు ప్రభుత్వం ₹ 5 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

 సెప్టెంబరు 27, 2014 న, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష మరియు ₹ 100 కోట్ల జరిమానా విధించింది. జయలలిత స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని కూడా ఆదేశించింది. వసూళ్లను జరిమానా మొత్తానికి సర్దుబాటు చేయాలని ఆదేశించారు.  

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. చెన్నైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జయలలిత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సొమ్ము నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కోర్టు పేర్కొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో మాజీ సీఎం జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు వీ శశికళ, మేనల్లుడు వీఎన్ సుధాకరన్, శశికళ బంధువుపై కేసు నమోదైంది.

PREV
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !